News January 27, 2025
ముత్తంగి అలంకరణలో భద్రాద్రి రామయ్య దర్శనం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో సోమవారం భక్తులకు స్వామివారు ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
Similar News
News November 17, 2025
కోళ్లకు టీకా ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్లలో ప్రాణాంతక వ్యాధులను అధిగమించేందుకు కోడిపిల్లల స్థాయి నుంచే సమయానుగుణంగా టీకాలు వేయించాల్సి ఉంటుంది. అయితే ఈ టీకాలు కోళ్లకు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టీకా మందులను ఎప్పుడూ ఐస్ లేదా ఫ్రిజ్లో నిల్వ ఉంచి ఉపయోగించాలి. కోళ్లకు ఇతర రోగాలు ఉన్నపుడు టీకాలు వేయకూడదు. కోళ్లు అస్వస్థతకు గురైనప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు టీకాలు వేయకూడదు. టీకాలను పగలు కంటే రాత్రివేళల్లో వేయడం మంచిది.
News November 17, 2025
యాదాద్రి: నేటి నుంచి పత్తి మిల్లులు బంద్

నేటి నుంచి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి మిల్లుల అసోసియేషన్ నిరవధిక బంద్ను పాటించనున్నట్లు పత్తి మిల్లుల అసోసియేషన్ తెలిపింది. కావున రైతులెవరూ మార్కెట్ యార్డ్కు పత్తిని తీసుకురావద్దని మిల్లుల యాజమాన్యం కోరింది. దీంతో ఇప్పటికే ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న పత్తి రైతులు ఏం చేయాలో తెలీక అయోమయంలో పడిపోయారు. అధికారులు త్వరగా చర్చలు జరిపి మిల్లులు తెరుచుకునేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
News November 17, 2025
HYD: మహిళలు.. దీనిని అశ్రద్ధ చేయకండి

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందని HYD MNJ వైద్యులు తెలిపారు. రొమ్ములో కణతి చేతికి తగలడం, చనుమొన నుంచి రక్తం, ఇతర స్రవాలు కారటం, చొట్టబడి లోపలికి పోవడం, ఆకృతిలో మార్పు, గజ్జల్లో వాపు లాంటివి కనిపిస్తే వెంటనే చెక్ చేయించుకోవాలని సూచించారు. 40 ఏళ్లు దాటిన మహిళ మామోగ్రామ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవడం మంచిదని MNJ ప్రొ.రఘునాథ్రావు తెలిపారు.


