News January 27, 2025

ముత్తంగి అలంకరణలో భద్రాద్రి రామయ్య దర్శనం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో సోమవారం భక్తులకు స్వామివారు ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

Similar News

News November 16, 2025

పంచాయతీ నిధుల వివరాలు తెలుసుకోండిలా!

image

గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, ఖర్చులను తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. కానీ ఎవరిని అడగాలో తెలియదు. అయితే ‘e-Gram Swaraj’ <>పోర్టల్<<>> ద్వారా గ్రామ పంచాయతీలు.. వాటి నిధులు-ఖర్చుల వివరాలు తెలుసుకోవచ్చు. ఆర్థిక సంఘం ఏటా విడుదల చేసే నిధులు, పథకాల నిధులు, వాటి వినియోగ వివరాలను ట్రాక్ చేయొచ్చు. వార్షిక ప్రణాళికలూ అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం PR పోర్టల్ చెక్ చేయాలి. share it

News November 16, 2025

లోక్ అదాలత్‌కు భారీ స్పందన: ADB SP

image

ఆదివారం జరిగిన లోక్ అదాలత్‌కు జిల్లా వ్యాప్తంగా ప్రజల నుండి భారీగా స్పందన వచ్చిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,538 కేసులను పరిష్కరించామన్నారు. 300 ఎఫ్ఐఆర్, 577 పెట్టి, 2661 డ్రంక్ & డ్రైవ్ కేసులు సాల్వ్ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సిబ్బందికి, అధికారులకు అభినందనలు తెలిపారు.

News November 16, 2025

కర్నూలు: రేపు ‘డయల్ యువర్ APSPDCL CMD’

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘డయల్ యువర్ APSPDCL CMD’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం సహా తొమ్మిది జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలు చెప్పవచ్చని ఆయన పేర్కొన్నారు.