News February 17, 2025
ముత్తంగి అలంకారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో సోమవారం రామయ్యకు ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం సందర్భంగా స్వామి వారు ముత్తంగి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రభాత సేవ అనంతరం విశ్వక్సేన ఆరాధన, కర్మఃపుణ్యహచన చేసి స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మ వారికి కంకణధారణ యోక్త్రధారణ తదితర కార్యక్రమాలతో రామయ్యకు నిత్య కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
Similar News
News December 24, 2025
‘అమరావతి’ బిల్లుపై నేడు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం?

AP: అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇవాళ జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2014-2024 మధ్య HYD ఉమ్మడి రాజధానిగా ఉంది. దీంతో 2024 జూన్ 2 నుంచి AP రాజధానిగా అమరావతిని గుర్తించాలని ప్రభుత్వం కోరుతున్న విషయం తెలిసిందే.
News December 24, 2025
నకిలీ వైద్యులకు కేరాఫ్ నల్గొండ

జిల్లాలో నకిలీ వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నల్గొండతోపాటు DVK, MLG, అనుముల, NKL, చిట్యాల, చండూరు తదితర ప్రాంతాల్లో నకిలీ వైద్యులు శస్త్ర చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో జిల్లాలో నకిలీ వైద్యుల బాగోతం బయటపడింది. నకిలీ వైద్యులపై జిల్లా వైద్య శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.
News December 24, 2025
హాదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వం.. సోదరుడి ఆరోపణ

బంగ్లాదేశ్లో అల్లర్లకు కారణమైన ఉస్మాన్ హాదీ హత్యపై ఆయన సోదరుడు ఒమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలను అస్థిరపరిచేందుకు యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే ఈ హత్య చేయించారని ఆరోపించారు. కాగా హాదీపై ఈ నెల 12న కాల్పులు జరగగా ఆయన సింగపూర్లో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.


