News February 17, 2025
ముత్తంగి అలంకారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో సోమవారం రామయ్యకు ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం సందర్భంగా స్వామి వారు ముత్తంగి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రభాత సేవ అనంతరం విశ్వక్సేన ఆరాధన, కర్మఃపుణ్యహచన చేసి స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మ వారికి కంకణధారణ యోక్త్రధారణ తదితర కార్యక్రమాలతో రామయ్యకు నిత్య కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
Similar News
News April 17, 2026
ఆదోని మార్కెట్లో పత్తి ధర రూ.8,939

ఆదోని వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.8,939 పలికింది. వేరుశనగ రూ.7,729, ఆముదాలకు రూ.6,076 ధర దక్కింది. సీసీఐ కేంద్రాలు మూతపడటంతో పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. అయితే మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే జాతీయ మార్కెట్ అని, కనీస సౌకర్యాలు లేవని వారు మండిపడుతున్నారు.
News April 17, 2026
ATP: రక్తదానం చేస్తే రూ.3 లక్షల బీమా

సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 20న కళ్యాణదుర్గం ప్రజావేదికలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ నేత దేవినేని ధర్మతేజ తెలిపారు. కంబదూరు మండలం ములకనూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రక్తదానం చేసే వారికి రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
News April 17, 2026
ATP: రక్తదానం చేస్తే రూ.3 లక్షల బీమా

సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 20న కళ్యాణదుర్గం ప్రజావేదికలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ నేత దేవినేని ధర్మతేజ తెలిపారు. కంబదూరు మండలం ములకనూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రక్తదానం చేసే వారికి రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.


