News March 7, 2025
ముత్తన్నపేట: అప్పుల బాధతో వ్యక్తి మృతి.. కేసు నమోదు

ముత్తన్నపేట గ్రామానికి చెందిన రవి (45) వ్యవసాయానికి చేసిన అప్పులు, పిల్లల చదువుల ఫీజులు చెల్లించలేక బుధవారం సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని బెజ్జంకి ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. పురుగుల మందు సేవించిన ఆయనను కరీంనగర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Similar News
News October 27, 2025
జగిత్యాల: పంట కొనుగోళ్లపై సందేహాలున్నాయా..?

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతునేస్తం కార్యక్రమాన్ని రేపు ఉ.10 నుంచి 11 గం.ల వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై మార్కెటింగ్, మార్క్ ఫెడ్, ECCI అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లా రైతులు తమ సమీప రైతువేదికల్లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని పంట కొనుగోళ్లపై ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు.
News October 27, 2025
శ్రేయస్కు సీరియస్.. అసలు ఏమైందంటే?

శ్రేయస్ అయ్యర్ గాయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అతడికి ఇంటర్నల్ ఇంజ్యూరీ అయింది. ఎడమవైపు పక్కటెముకల వద్ద ఉండే Spleen(ప్లీహమ్) అవయవానికి తీవ్ర గాయమైంది. ఇది ఇంటర్నల్ బ్లీడింగ్(spleen rupture)కు దారితీసింది. దీంతో సాధారణంగా ప్లీహమ్ చేసే రక్తకణాల శుద్ధి, బ్లడ్ సెల్స్ స్టోరేజీ, పాత రక్తకణాల తొలగింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఈ గాయాన్ని హీల్ చేసేందుకే శ్రేయస్ను ICUలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
News October 27, 2025
చోది మేళ్లలొ చోరీ.. రూ.15 లక్షల సొత్తు అపహరణ

ఇంటికి తాళం వేసి గుడికి వెళ్లి తిరిగొచ్చేసరికి తాళాలు పగులగొట్టి దుండగులు చోరీ చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. చోదిమెళ్లకి చెందిన బాధితుడు వేమూరి అనంతరామ్ వివరాల మేరకు.. తాను తన కుటుంబంతో కలిసి 26న పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. తిరిగి సోమవారం వచ్చి చూడగా, తలుపు తాళాలు, బీరువా ధ్వంసమై ఉన్నారు. సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి చోరీకి గురైందన్నారు. క్లూస్టీం వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.


