News March 12, 2025
ముదిగుబ్బ మండలంలో 120ఏళ్ల వృద్ధుడి మృతి

ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఉరుముల బుచ్చన్న (120) అనే శతాధిక వృద్ధుడు శివైక్యం చెందారు. 1905లో జన్మించిన ఆయన స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటాలను కళ్లారా చూశారు. వందేళ్లు దాటినా ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తాను చేసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. వయసుమీద పడటంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు చెప్పారు. గొప్ప కళాకారుడిని కోల్పోయామని గ్రామస్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Similar News
News November 15, 2025
టాస్క్ రీజనల్ సెంటర్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఫ్రీ కోచింగ్

కిషన్ పుర చైతన్య యూనివర్సిటీలోని టాస్క్ ఆఫీసులో ప్రముఖ టెక్నికల్ కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. Java, Python, వెబ్ డెవలప్మెంట్, డేటా బేస్, Sudo కోడ్, C, C++, HTML, CSS, Java Script, ఆప్టిట్యూడ్ రీజనింగ్పై కోచింగ్ ఇస్తారని, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు టాస్క్ ఆఫీసులో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
News November 15, 2025
APPLY NOW: RRUలో 9 పోస్టులు

గుజరాత్లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ<
News November 15, 2025
మొత్తం పెట్టుబడులు రూ.13 లక్షల కోట్లు: CBN

AP: CII సదస్సు ద్వారా రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని CM CBN ప్రకటించారు. గత 18నెలల్లో ఇన్వెస్ట్మెంట్స్ రూ.22లక్షల కోట్లకు చేరాయన్నారు. శ్రీసిటీలో మరికొన్ని యూనిట్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు కంపెనీలతో MoUలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా 12,365 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 2028 నాటికి శ్రీసిటీని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామని స్పష్టం చేశారు.


