News March 12, 2025
ముదిగుబ్బ మండలంలో 120ఏళ్ల వృద్ధుడి మృతి

ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఉరుముల బుచ్చన్న (120) అనే శతాధిక వృద్ధుడు శివైక్యం చెందారు. 1905లో జన్మించిన ఆయన స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటాలను కళ్లారా చూశారు. వందేళ్లు దాటినా ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తాను చేసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. వయసుమీద పడటంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు చెప్పారు. గొప్ప కళాకారుడిని కోల్పోయామని గ్రామస్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Similar News
News November 11, 2025
ప్చ్.. దేశంలోనే జూబ్లీహిల్స్ లాస్ట్!

ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోలింగ్ శాతంలో మన హైదరాబాద్ చివరి స్థానంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా 8 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. మిజోరంలోని డంపా 82.34 శాతంతో పోలింగ్లో నం.1 స్థానంలో నిలిచింది. మన జూబ్లీహిల్స్ మాత్రం 48.43% ఓటింగ్తో చివరి స్థానానికి పడిపోయింది. సెన్సిటివ్ ప్రాంతమైన జమ్మూకశ్మీర్లోని బడ్గాం నియోజకవర్గంలో మన కంటే 2% ఎక్కువే నమోదైంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఏమో?
News November 11, 2025
ప్చ్.. దేశంలోనే జూబ్లీహిల్స్ లాస్ట్!

ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోలింగ్ శాతంలో మన హైదరాబాద్ చివరి స్థానంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా 8 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. మిజోరంలోని డంపా 82.34 శాతంతో పోలింగ్లో నం.1 స్థానంలో నిలిచింది. మన జూబ్లీహిల్స్ మాత్రం 48.43% ఓటింగ్తో చివరి స్థానానికి పడిపోయింది. సెన్సిటివ్ ప్రాంతమైన జమ్మూకశ్మీర్లోని బడ్గాం నియోజకవర్గంలో మన కంటే 2% ఎక్కువే నమోదైంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఏమో?
News November 11, 2025
వనపర్తి: ‘చిన్న నీటి వనరుల గణన పకడ్బందీగా చేపట్టాలి’

వనపర్తి జిల్లాలో చిన్న నీటి వనరుల లెక్క తేల్చేందుకు నిర్వహించనున్న గణన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ మంగళవారం ఆదేశించారు. తన ఛాంబర్లో చిన్న నీటి వనరుల గణనపై జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. 2 వేల హెక్టార్లలోపు విస్తీర్ణం ఉన్న జలవనరుల గణనను మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.


