News April 11, 2025
ముదిగుబ్బ: మహిళలకు బాలికలకు శక్తి యాప్ ఎంతో భద్రత

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలోని మంగళమడక గ్రామంలో గురువారం రాత్రి ఎస్పీ రత్న నేర నియంత్రణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శక్తి యాప్ ప్రతి మహిళ ఫోన్లో ఉంచుకోవాలని వాటి ఉపయోగాల గురించి తెలిపారు. ప్రతి తల్లిదండ్రి విద్యార్థులకు మంచి చెడు స్పర్శల గురించి చెప్పాలన్నారు. అదేవిధంగా సైబర్ నేరాలపట్ల అప్రమత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ధర్మవరం డీఎస్పీ మహేష్, సీఐ శ్యామ్ రావు పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
సామాన్య యువకుడు… ₹9,960 CRకు అధిపతి

MPలోని మారుమూల పల్లెలో పుట్టి, మాతృభాషలో చదువుకున్న ఆ యువకుడు ₹9,960 CRకు అధిపతి అయ్యాడు. ‘Groww’ CEO లలిత్ కేష్రే బిలియనీర్ల జాబితాలో చేరాడు. IIT బాంబేలో చదివిన ఆయన ముగ్గురితో కలిసి 2016లో గ్రోను నెలకొల్పారు. వృద్ధి సాధించిన కంపెనీ FY2025లో ₹4,056Cr ఆదాయంతో ₹1,824Cr లాభాన్ని ఆర్జించింది. తాజాగా మార్కెట్లో లిస్ట్ అయిన దీని క్యాపిటలైజేషన్ ₹1.05L Crకు చేరింది. ఇందులో 55.91Cr షేర్స్ కేష్రేవే.
News November 18, 2025
సామాన్య యువకుడు… ₹9,960 CRకు అధిపతి

MPలోని మారుమూల పల్లెలో పుట్టి, మాతృభాషలో చదువుకున్న ఆ యువకుడు ₹9,960 CRకు అధిపతి అయ్యాడు. ‘Groww’ CEO లలిత్ కేష్రే బిలియనీర్ల జాబితాలో చేరాడు. IIT బాంబేలో చదివిన ఆయన ముగ్గురితో కలిసి 2016లో గ్రోను నెలకొల్పారు. వృద్ధి సాధించిన కంపెనీ FY2025లో ₹4,056Cr ఆదాయంతో ₹1,824Cr లాభాన్ని ఆర్జించింది. తాజాగా మార్కెట్లో లిస్ట్ అయిన దీని క్యాపిటలైజేషన్ ₹1.05L Crకు చేరింది. ఇందులో 55.91Cr షేర్స్ కేష్రేవే.
News November 18, 2025
ఏఐ సాంకేతికత ద్వారా శానిటేషన్ నియంత్రణకు చర్యలు: వరంగల్ మేయర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ద్వారా శానిటేషన్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కమిషనర్ చాహత్ బాజ్ పాయ్తో బల్దియా ప్రధాన కార్యాలయంలో గల ఐసీసీసీ కేంద్రంలో క్షేత్ర స్థాయిలో సందర్శించి అక్కడే అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు సూచనలు చేశారు.


