News February 24, 2025
ముదినేపల్లి కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్

ఏలూరు జిల్లాలో ఓ ప్రిన్సిపల్పై వేటు పడింది. ముదినేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ జాస్మిన్పై పలు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీలో జనవరి 4న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఆ రోజు ఆమె వ్యవహరించిన తీరుపై కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారి సాల్మన్ రాజు విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈ మేరకు ఆమెను సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ శారద ఉత్తర్వులిచ్చారు.
Similar News
News January 5, 2026
దారుణం.. USలో భారతీయ యువతి హత్య

USAలోని మేరీల్యాండ్లో భారతీయ యువతి నిఖిత గొడిశెల(27) దారుణ హత్యకు గురయ్యారు. యువతి కనిపించట్లేదని మాజీ ప్రేమికుడు అర్జున్ JAN 2న పోలీసులకు ఫిర్యాదు చేసి ఆపై INDకు పయనమయ్యారు. 3న అతని అపార్టుమెంటును పరిశీలించగా కత్తిపోట్లకు గురైన యువతి డెడ్బాడీ కనిపించింది. DEC 31న అర్జున్ ఆమెను చంపినట్లు భావిస్తున్న పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అటు యువతి పేరెంట్స్ను USలోని భారత ఎంబసీ సంప్రదించింది.
News January 5, 2026
వెనిజులాను US పాలించదు: మార్కో రుబియో

వెనిజులాపై ఆధిపత్యం విషయంలో అమెరికా కాస్త వెనక్కి తగ్గినట్లు కన్పిస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు మదురోను US బలగాలు అరెస్ట్ చేసిన తర్వాత వెనిజులాను తమ అధీనంలోకి తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే US విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. వెనిజులాను అమెరికా పాలించదని స్పష్టం చేశారు. అయితే చమురు నిర్బంధం విషయంలో మార్పులకు ఆ దేశంపై ఒత్తిడి తెస్తుందన్నారు.
News January 5, 2026
T20 WCలో భారత్కు అతడే కీ ప్లేయర్: డివిలియర్స్

రానున్న T20 WCలో భారత జట్టులో హార్దిక్ పాండ్య కీ ప్లేయర్ అని SA క్రికెట్ దిగ్గజం డివిలియర్స్ అన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా అతను బ్యాటింగ్, బౌలింగ్ చేయగలరని కొనియాడారు. పాండ్య జట్టులో ఉండటం కెప్టెన్ సూర్యకు పెద్ద ఆస్తి అని తెలిపారు. హార్దిక్ నాలుగైదు ఓవర్లు క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టుకు ఓటమి ఖాయమని చెప్పారు. ఇటీవల VHTలో పాండ్య ఒకే ఓవర్లో 5 సిక్సులు బాది విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.


