News February 24, 2025
ముదినేపల్లి కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్

ఏలూరు జిల్లాలో ఓ ప్రిన్సిపల్పై వేటు పడింది. ముదినేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ జాస్మిన్పై పలు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీలో జనవరి 4న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఆ రోజు ఆమె వ్యవహరించిన తీరుపై కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారి సాల్మన్ రాజు విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈ మేరకు ఆమెను సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ శారద ఉత్తర్వులిచ్చారు.
Similar News
News October 21, 2025
కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం: రేవంత్

TG: నిజామాబాద్లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి CM రేవంత్ రూ.కోటి పరిహారం ప్రకటించారు. HYDలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ప్రసంగించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం ప్రకటించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.
News October 21, 2025
MBNR: డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ 3, 5 సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్లాగ్) పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 24 వరకు చెల్లించాలని, ఈనెల 29 వరకు ఫైన్ (లేట్ ఫీజు)తో ఫీజులు చెల్లించాలని తెలిపారు. అలాగే మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ ఫీజును ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 25 వరకు, లేట్ ఫీజుతో ఈనెల 29 వరకు పరీక్షల ఫీజులు చెల్లించాలని కోరారు.
News October 21, 2025
జగిత్యాల: ఉరివేసుకొని యువకుడి సూసైడ్

జగిత్యాల(D) ధర్మపురి మండలం దమ్మన్నపేటకి చెందిన జగిశెట్టి సచిన్(29) ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సచిన్కు చిన్నతనంలో చేతికి తగిలిన గాయం కారణంగా ప్రస్తుతం ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. ఇందుకోసం హైదరాబాద్లో వైద్యం చేయించారు. 6 నెలల వరకు ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే అనారోగ్యం కారణంతో సచిన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.