News February 24, 2025
ముదినేపల్లి కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్

ఏలూరు జిల్లాలో ఓ ప్రిన్సిపల్పై వేటు పడింది. ముదినేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ జాస్మిన్పై పలు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీలో జనవరి 4న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఆ రోజు ఆమె వ్యవహరించిన తీరుపై కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారి సాల్మన్ రాజు విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈ మేరకు ఆమెను సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ శారద ఉత్తర్వులిచ్చారు.
Similar News
News March 25, 2025
అచ్చంపేట: వేతనాలు లేక లైబ్రేరియన్ల అవస్థలు..!

జిల్లా గ్రంథాలయ శాఖల్లో పనిచేస్తున్న లైబ్రరియన్లకు మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అచ్చంపేట లైబ్రేరియన్ శంకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ముగ్గురు లైబ్రేరియన్లు, మరో 15 మంది పార్టీ వర్కర్లు, స్వీపర్లు పనిచేస్తున్నారు. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 25, 2025
ఇటిక్యాల: ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

ఇటిక్యాల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగరావు ఈరోజు పనులను తనిఖీ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని జాబ్ కార్డు ఉన్న ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఇటిక్యాల ఎంపీడీవో, ఎర్రవల్లి ఎంపీడీవో, ఇతర ఉన్నతాధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేశ్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
News March 25, 2025
ట్రంప్కు గిఫ్ట్ పంపించిన పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్, US అధ్యక్షుడు ట్రంప్ మధ్య స్నేహం మరింత పెరుగుతోంది. ఈ నెల మొదట్లో ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కోఫ్కు భేటీ అనంతరం ట్రంప్ చిత్రపటాన్ని పుతిన్ ఆయనకు ఇచ్చారని మాస్కో ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. ఆ బహుమతి పట్ల ట్రంప్ చాలా సంతోషించారని విట్కోఫ్ తాజాగా వెల్లడించారు. ఎప్పుడూ ఉప్పు-నిప్పుగా ఉండే అమెరికా, రష్యా బంధం ట్రంప్ వచ్చాక మెరుగుపడుతున్న సంగతి తెలిసిందే.