News April 5, 2025

ముదినేపల్లి: రోడ్డు ప్రమాదంలో విద్యార్ధి మృతి

image

కాకినాడ(D) గండేపల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ డిగ్రీ విద్యార్థి బాడవుల కేదార్ మణికంఠ(21) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గండేపల్లి ఎస్సై శివ నాగబాబు వివరాల ప్రకారం.. ఏలూరు(D) ముదినేపల్లికి చెందిన మణికంఠ రాజమండ్రిలో చదువుతున్నాడు. ఫ్రెండ్ విష్ణువర్ధన్‌తో కలిసి బిర్యానీ తినేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా గండేపల్లి శివారులో ఎదురుగా వస్తున్న బైకు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

Similar News

News November 2, 2025

కొండవీడు ఘాట్‌ రోడ్డు మూసివేత

image

కొండవీడు కొండలపై నుంచి ఘాట్ రోడ్డులోకి ఊట నీటితో బండరాళ్లు జారిపడే ప్రమాదం ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియ తెలిపారు. ఇటీవల పడిన కొండ చర్యల తొలగింపు పనులను ఆమె శనివారం పరిశీలించారు. ఆది, సోమవారాల్లో ఘాట్ రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటకులు, సందర్శకులు కొండవీడుకు రావద్దని ఆమె కోరారు.

News November 2, 2025

నిజాంపేట: ఇదేనేమో నేటి టెక్నాలజీ..!

image

రోజురోజుకూ మారుతున్న టెక్నాలజీ ప్రభావం గ్రామాల్లో జరిగే సంప్రదాయ విక్రయాల్లోనూ కనిపిస్తోంది. గతంలో గ్రామాల్లో తిరుగుతూ కూరగాయలు, వివిధ వస్తువులు అమ్మేవారిని చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా నిజాంపేటలో గాడిది పాలు అమ్మే ఓ వ్యక్తి మైక్‌లో ‘గాడిద పాలు’ అంటూ ప్రకటన చేస్తూ విక్రయిస్తున్నారు. మైక్ శబ్దం విని అతడిని చూసిన స్థానికులు..’ఇదేనేమో నేటి టెక్నాలజీ’ అంటూ చర్చించుకుంటున్నారు.

News November 2, 2025

కాంగ్రెస్ కార్యాలయాన్ని BRSగా మార్చడమే ఆందోళనకు కారణమా..?

image

పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేగా కాంతారావు 2018లో గెలిచారు. ఆ తరువాత BRSలో చేరి అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ పార్టీ కార్యాలయ వివాదం తెర మీదికి వచ్చింది. దీంతో ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌కి నిప్పు పెట్టారు. అనంతరం కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.