News July 20, 2024

ముదివేడు: ప్రిన్సిపల్ సహా నలుగురు సస్పెండ్

image

ముదివేడు కస్తూర్భా పాఠశాలలో ముగ్గరు విద్యార్థులు రెండు రోజులు క్రితం ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన ఉన్నాధికారులు ప్రిన్సిపల్ రఫియా పర్వీన్, హిందీ టీచర్ గౌసియా మస్తానీ, ఏఎన్ఎం భాను, అకౌంటెంట్‌లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News December 1, 2025

చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం

image

చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవిన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 31 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను త్వరితగతిన, చట్టబద్ధంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ఇందులో బైక్ దొంగతనం-1, చీటింగ్-1, కుటుంబ/ఇంటి తగాదాలు-9, వేధింపులు-1, భూ తగాదాలు-8, డబ్బు-4, దొంగతనం-1, ఆస్తి-6. ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.

News December 1, 2025

ఆ వ్యాధి గురించి భయపడకండి: చిత్తూరు DMHO

image

చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు స్కబ్ టైపన్ కేసులు 149 నమోదయ్యాయని.. అందరూ కోలుకున్నారని DMHO సుధారాణి వెల్లడించారు. చిన్న నల్లి లాంటి ప్రాణి కుట్టడంతో ఈ వ్యాధి వస్తుందన్నారు. తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయని తెలిపారు. బురదలో నడిచినప్పుడు, పొలాల్లో చెప్పులు లేకుండా తిరిగినప్పుడు ఇవి కుడుతాయన్నారు. జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే యాంటి బయోటిక్స్ ద్వారా నయమవుతుందని స్పష్టం చేశారు.

News December 1, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. రూ.700కు చేరిన టమాటా

image

దిత్వా తుఫాను ఎఫెక్ట్ టమాటా ధరలపై పడింది. పుంగనూరు మార్కెట్‌లో సోమవారం 15 కిలోల టమాటా బాక్స్ రూ.700 పలికింది. 66.19 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. రెండో రకం రూ.500, మూడో రకం రూ.350 చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధరలు పెరిగినట్లు రైతులు తెలిపారు.