News September 1, 2024
ముద్దనూరు మండలంవ్యాప్తంగా 57 పింఛన్లు తొలగింపు

ముద్దనూరు మండలం సామాజిక పింఛన్లకు అనర్హులైన కొందరు లబ్దిదారులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పింఛన్లు పొందుతున్న 57 మందిని ప్రభుత్వం తొలగించినట్లు ఎంపీడీఓ చంద్రమౌళీశ్వర్ తెలిపారు. ఆ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు సంబంధించి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల తదితర పింఛన్లు 5,318 ఉన్నాయన్నారు. కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పింఛన్లు పొందుతున్నారన్నారు.
Similar News
News February 24, 2026
కడప: మొదటి రోజు పరీక్షలకు 748 మంది గైర్హాజరు

కడప జిల్లాలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 96శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 62 సెంటర్లలో 17,726 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 748 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 16,392 మందికి గానూ, 15,789 మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 1,334 మందికిగాను, 1,189 మంది పరీక్షలకు వచ్చారు.
News February 24, 2026
వైవీయూలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

YVU పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 25వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా భారతీయ యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఎంపీఈడీ/ఎంపీఈ ఉత్తీర్ణత పొంది, నెట్, సెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సందర్శించాలన్నారు.
News February 24, 2026
వైవీయూలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

YVU పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 25వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా భారతీయ యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఎంపీఈడీ/ఎంపీఈ ఉత్తీర్ణత పొంది, నెట్, సెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సందర్శించాలన్నారు.


