News September 22, 2024
ముద్దనూరు: సినీ ఫక్కిలో దొంగతనం

కడప- తాడిపత్రి ప్రధాన జాతీయ రహదారి సమీపంలోని బొందలకుంట గ్రామంలో శనివారం సినీ ఫక్కిలో దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బొందకుంట రహదారిలో బైక్పై వెళ్తున్న అదే గ్రామానికి చెందిన మంగపట్నం పుల్లయ్య, సుబ్బమ్మలను పోలీసులమని చెప్పి ఆపి.. వారి వద్ద ఉన్న బంగారు చైను, ఉంగరం అపహరించుకుపోయారు. విషయం తెలుసుకున్న ముద్దనూరు సీఐ దస్తగిరి, SI మైనుద్దీన్లు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News November 26, 2025
కడప జిల్లాలో 201 మంది హౌసింగ్ ఉద్యోగులకు జీతాలు నిలిపివేత

కడప జిల్లాలో 201 మంది హౌసింగ్ ఉద్యోగులకు నవంబర్ నెల జీతాలు నిలిపివేస్తూ ఆ శాఖ ఎండీ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ‘ఫేజ్-3’లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లోని లోపాలపై ఇటీవల పరిశీలన చేపట్టారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లాలో 6,298 ఇళ్ల నిర్మాణాలకు అదనపు చెల్లింపు జరిగినట్లు గుర్తించారు. ఇందుకు 30 మంది ఏఈఎస్లు, 171 మంది ఈఏ/డబ్ల్యూఏఎస్లను బాధ్యులను చేస్తూ ఈ చర్యలు తీసుకున్నారు.
News November 26, 2025
కన్నీటి నివాళి: ‘అమ్మే మా వెన్నెముక’

కుటుంబానికి వెన్నెముకగా, జీవితానికి వెలుగుగా నిలిచిన <<18391262>>అమ్మ<<>> రత్నమ్మ (83) ఇక లేరనే నిజాన్ని అంగీకరించడం భారంగా ఉందని ఎంపీ సీఎం రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ప్రేమ, త్యాగం, ఆప్యాయత మాటలతో చెప్పలేనంత గొప్పవని అన్నారు. అమ్మ లేకపోవడం మాటల్లో చెప్పలేని పెద్ద లోటుగా మిగిలిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
News November 26, 2025
ఎంపీ సీఎం రమేశ్ తల్లి మృతి

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ (83) మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున 3.39 గంటలకు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కడప జిల్లా పొట్లదుర్తి గ్రామంలో రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


