News January 30, 2025

ముద్దోల్: జాతీయస్థాయి రామన్ అవార్డు పోటీలకు ఎంపిక

image

తానూర్ మండలంలోని బోసి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శ్యాముల్వార్ అభిజ్ఞ, చాదల ప్రవీణ్ కుమార్ జాతీయ స్థాయి రామన్ అవార్డు ( ఫైనల్) పోటీలకు ఎంపికైనట్లు గైడ్ టీచర్ సుధాకర్ తెలిపారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో బెంగళూరులో నిర్వహించే ఫైనల్స్‌లో విద్యార్థులు పాల్గొంటారన్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను డీఈవో రామారావు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News January 6, 2026

సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 54 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

<>సౌత్ ఈస్ట్రన్<<>> రైల్వే స్పోర్ట్స్ కోటాలో 54 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు జనవరి 10 నుంచి ఫిబ్రవరి 2వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ ఉత్తీర్ణులై, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించినవారు అర్హులు. స్పోర్ట్స్ ట్రయల్స్‌, స్పోర్ట్స్, విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rrcser.co.in

News January 6, 2026

కోనసీమ: దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్లోఅవుట్‌ ఇదే..!

image

ఇరుసుమండ బ్లో అవుట్ నేపథ్యంలో ప్రజలు 1995 నాటి పాసర్లపూడి ఓఎన్‌జీసీ బావి అగ్నిప్రమాద ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్లోఅవుట్‌గా నమోదైన ఈ మంటలను ఆర్పేందుకు అమెరికా నిపుణుడు నీల్ ఆడమ్స్ బృందం రంగంలోకి దిగింది. అయితే ఓఎన్‌జీసీ అధికారులతో వ్యూహపరమైన విభేదాల వల్ల ఆయన మధ్యలోనే నిష్క్రమించారు. చివరకు 65 రోజుల తర్వాత అంతర్జాతీయ సంస్థల సాయంతో మంటలను అదుపు చేశారు.

News January 6, 2026

వరంగల్: రెన్యువల్ చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ జాప్యం!

image

వరంగల్ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులకు సంబంధించి అనుమతుల పునరుద్ధరణ(రెన్యువల్) చేయడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జాప్యం చేస్తున్నారు. జిల్లాలో 180కి పైగా ప్రైవేట్ ఆస్పత్రిలో ఉండగా అందులో సగానికి పైగా రెన్యువల్ కాలేదు. దీంతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు సీఎం సహాయ నిధి పథకం కింద వైద్యం అందించలేకపోతున్నారు. తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని ఆసుపత్రుల నిర్వాహకులు వాపోతున్నారు.