News March 28, 2025
మునగాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన మల్టీ పర్పస్ వర్కర్ షేక్ జానీ పాషా శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం లాలాపురం గ్రామం నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా కూసుమంచి ఫ్లైఓవర్ దగ్గర బైక్ అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. జానీ మృతితో నారాయణగూడెంలో విషాదం అలుముకుంది.
Similar News
News April 22, 2025
కైరిగూడ ఓపెన్ కాస్ట్లో 100% బొగ్గు ఉత్పత్తి

బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్ కాస్ట్లో 100% బొగ్గు ఉత్పత్తి సాధించడం అభినందనీయమని ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం కైరిగూడ ఓపెన్ కాస్ట్ను సందర్శించిన ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. బొగ్గు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూనే ఈ వార్షిక సంవత్సరంలోనూ 100%ఉత్పత్తి సాధించడానికి కృషి చేయాలన్నారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ నరేందర్, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న పాల్గొన్నారు.
News April 22, 2025
భూ భారతిపై ఎలాంటి అపోహలు వద్దు: కలెక్టర్ గౌతమ్

భూభారతి చట్టంపై ఏలాంటి అపోహాలు పెట్టుకోవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చి నివృత్తి చేసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. మంగళవారం శామీర్ పేట మండలం తూంకుంటలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై అవగహన కల్పించారు. ప్రభుత్వం రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News April 22, 2025
అమిత్ షాకు ప్రధాని మోదీ ఫోన్

సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న PM నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. జమ్మూకశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించాలని అమిత్ షాను PM ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడిలో ఇప్పటి వరకు ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.