News June 29, 2024

మున్సిపల్ అధికారులతో కలెక్టర్ బాలాజీ సమీక్ష

image

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలిసి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూలై ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. ఒకటో తేదీన 90 శాతం పైగా పింఛన్లు పంపిణీ పూర్తయ్యే విధంగా ప్రణాళికలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మున్సిపల్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 18, 2025

తాడిగడపకు పాత పేరు ఖరారు

image

గత వైసీపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ’గా నామకరణం చేసిన పేరును మార్చాలని స్థానిక ప్రజలు కోరారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించిన అనంతరం, మున్సిపాలిటీకి ‘తాడిగడప’ అనే పాత పేరును పునరుద్ధరించాలని నిర్ణయించారు.

News October 18, 2025

అభివృద్ధి పనుల బిల్లులను తక్షణం చెల్లించండి: కలెక్టర్

image

వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి చేసిన పనుల బిల్లుల చెల్లింపుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ బిల్లుల చెల్లింపులపై సమీక్షించారు. పూర్తి చేసిన పనులకు సకాలంలో బిల్లులు రూపొందించి Onlineలో Uplod చేయాలని, కాంట్రాక్టర్లకు తుది బిల్లు చెల్లించేంత వరకు బాధ్యత వహించాలన్నారు.

News October 17, 2025

కృష్ణా: ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

image

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ పలువురు ఉద్యోగుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఉద్యోగులు విన్నవించిన వివిధ సమస్యలను ఆయన ఓపిగ్గా ఆలకించి పరిష్కారంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.