News February 3, 2025
ముమ్మిడివరం: పోలీసుల వేధింపులతో ఆత్మహత్య?

ముమ్మిడివరం: గేదెల్లంకకు చెందిన శివరామకృష్ణ (32) ఆత్మహత్య కలకలం రేపింది. శనివారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ముమ్మిడివరం ఎస్సై జ్వాలాసాగర్ కేసు నమోదుచేశారు. శివరామకృష్ణకు 11 నెలల క్రితం పెళ్లయింది. మృతుడు HYD ఎల్బీనగర్లో ప్రూట్ జ్యూస్ దుకాణం నిర్వహించేవాడు. ఎల్బీనగర్లోని ఓ కానిస్టేబుల్ భార్య అదృశ్యంలో ఇతని పాత్ర ఉందని వేధించడమే ఆత్మహత్యకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Similar News
News February 15, 2026
ఆత్మకూరు (ఎం): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

మండలంలోని రాయిపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మోత్కూరు నుంచి భువనగిరి వైపు బైక్పై వెళ్తుండగా మూలమలుపు వద్ద అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. మృతుడు తిరుమలగిరి తొండ గ్రామానికి చెందిన వెంకట్గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
News February 15, 2026
బోథ్: బంతి కోసం వెళ్లి బాలుడి మృతి

బోథ్ మండలంలో విషాదం నెలకొంది. కరత్వాడ గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్(12) ఆదివారం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న క్రమంలో బంతి పక్కన గల కాలువలో పడింది. బంతి కోసం వెళ్లిన షేక్ ఇమ్రాన్ ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు.
News February 15, 2026
ప్రొద్దుటూరు: కుటుంబీకులను తిట్టాడని చంపాడు

ప్రొద్దుటూరు నెహ్రూ రోడ్డులోని నాగులకట్ట వీధిలో 3 రోజుల క్రితం జరిగిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వినయ్ను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ కొండారెడ్డి ఆదివారం తెలిపారు. మద్యం తాగే సమయంలో కుటుంబ సభ్యులను దూషించాడనే కోపంతో వినయ్ కత్తితో గొంతులో పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. బొల్లవరం బస్స్టాప్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.


