News February 12, 2025

ములకలచెరువు: రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తం మృతి

image

రోడ్డుప్రమాదం ఓ కుటుంబం మొత్తాన్ని కబళించింది. ములకలచెరువులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె ప్రశాంతనగర్‌కు చెందిన భార్యాభర్తలు, పిల్లలు మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తప్పు ఎవరిదైనా ప్రమాదంలో నాలుగు ప్రాణాలు పోవడం తీరని విషాదం. ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. డ్రైవింగ్ చేసే ముందు మనకూ ఒక కుటుంబం ఉందని గుర్తించండి.

Similar News

News February 26, 2026

BELలో 72 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>), నవీ ముంబైలో 72 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హత గలవారు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. BE/BTech(ECE,ME), BSc, BCom, BA, డిప్లొమా అర్హతగల వారు అర్హులు. గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌లకు గరిష్ఠ వయసు 25ఏళ్లు కాగా, ఐటీఐ అప్రెంటిస్‌లకు 21ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

News February 26, 2026

ప్రకృతి సేద్యంలో బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

image

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.

News February 26, 2026

గురువార వ్రతాన్ని ఎలా చేయాలి?

image

సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. తలస్నానం చేయకూడదు. బట్టలు ఉతకకూడదు. గురు గ్రహానికి ఇష్టమైన పసుపు దుస్తులు ధరించాలి. విష్ణుమూర్తి లేదా బృహస్పతి పటాన్ని పసుపు గంధం, పుష్పాలతో అలంకరించాలి. దీపారాధనకు ఆవు నెయ్యి వాడాలి. పసుపు రంగులో ఉండే శనగపప్పు, బెల్లం, అరటిపండ్లు, శనగపిండితో చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం పూజ తర్వాత ఉప్పు లేని ఆహారాన్ని ఓసారి తీసుకోవాలి.