News February 12, 2025

ములకలచెరువు: రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తం మృతి

image

రోడ్డుప్రమాదం ఓ కుటుంబం మొత్తాన్ని కబళించింది. ములకలచెరువులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె ప్రశాంతనగర్‌కు చెందిన భార్యాభర్తలు, పిల్లలు మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తప్పు ఎవరిదైనా ప్రమాదంలో నాలుగు ప్రాణాలు పోవడం తీరని విషాదం. ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. డ్రైవింగ్ చేసే ముందు మనకూ ఒక కుటుంబం ఉందని గుర్తించండి.

Similar News

News December 6, 2025

కొక్కెర వ్యాధి – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కోళ్ల షెడ్డును శుభ్రంగా ఉంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. సంతలో కొన్న పెట్టలను, పుంజులను టీకాలు వేయకుండా షెడ్డులో కోళ్లతో కలిపి ఉంచకూడదు. పెద్ద, చిన్న కోళ్లను వేరువేరుగా ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనలతో కోడిపిల్లలు పుట్టిన తొలి వారంలోనే F1(RD)/Lasota టీకా మందు కంటిలో/ముక్కులో వేస్తే 6 వారాల వరకు ఈ కొక్కెర వ్యాధి రాదు. కోళ్లకు ఆరు వారాల వయసులో R2B (R.D.) వ్యాక్సిన్ 0.5 ml s/c వేయాలి.

News December 6, 2025

KNR: రూ.4.50CR SCAM.. ఎంక్వయిరీ రిపోర్ట్ ఎక్కడ..?

image

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.4.5 కోట్ల అవినీతి ఆరోపణలపై TVVP రెండు బృందాలతో విచారణ చేపట్టింది. దీనిపై ఎంక్వయిరీలో ఏం తేలిందన్నది బహిర్గతం చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వంలోని ఓ కీలక నేత రిపోర్టు బయటకు రాకుండా తొక్కిపెడుతున్నాడన్న చర్చ జోరుగా నడుస్తోంది. దీనిపై మంత్రులు జోక్యం చేసుకొని నిజానిజాలు బయట పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

News December 6, 2025

మాయిశ్చరైజర్‌ వాడితే చర్మం జిడ్డుగా మారుతోందా?

image

చలికాలంలో చర్మ ఆరోగ్యం కోసం మాయిశ్చరైజర్ వాడటం తప్పనిసరి. అయితే కొందరిలో దీనివల్ల చర్మం జిడ్డుగా మారి, మొటిమలు కూడా వస్తుంటాయి. ఇలాంటప్పుడు జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్, వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని వాడటం వల్ల చర్మంలోకి మాయిశ్చరైజర్ ఇంకి పొడిబారిపోకుండా సంరక్షిస్తుందంటున్నారు. అయినా సమస్య తగ్గకపోతే డెర్మటాలజిస్టును కలవడం మంచిదని సూచిస్తున్నారు.