News March 6, 2025
ములుగులో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష

ములుగు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వార్షిక పరీక్షల ఏర్పాట్లపై విద్యా, రెవెన్యూ, పోలీస్, వైద్య, పోస్టల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పరీక్షలు జరుగుతాయన్నారు. 21 సెంటర్లలో మొత్తం 3,134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
Similar News
News March 24, 2025
గద్వాల్: కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల ఆందోళన

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ రైతులు సాగు నీరు గత రెండు వారాల నుంచి ఇవ్వడం లేదని, పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, వెంటనే సాగు నీరు అందివ్వాలని సుమారు పన్నెండు గ్రామాల రైతులు కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కలెక్టర్కు తమ సమస్యలు పరిష్కరించాలని తెలపగా సానుకూలంగా స్పందించారు.
News March 24, 2025
ప్రతి రైతునూ ఆదుకుంటాం: మంత్రి అచ్చెన్న

AP: వడగండ్ల వాన వల్ల నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. ‘ఐదేళ్ల పాటు రైతులను అన్ని విధాలా ఇబ్బందులు పెట్టిన మాజీ సీఎం <<15869360>>జగన్<<>> ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. మీ పాలనలో రైతులకు రాయితీలు లేవు. ఎరువులు సక్రమంగా అందలేదు. సూక్ష్మ సేద్యం లేదు. వ్యవసాయ యాంత్రీకరణ లేదు. అన్ని రకాలుగా రైతులకు నష్టం కలిగించింది వైసీపీ ప్రభుత్వమే’ అని ట్వీట్ చేశారు.
News March 24, 2025
మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు…!

మెదక్ జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. హవేలిఘనపూర్, రేగోడ్ 36.6, అల్లాదుర్గ్ 36.5, పాపన్నపేట్ 36.4, కౌడిపల్లి, టేక్మాల్ 36.0, పెద్దశంకరంపేట్ 35.9, మెదక్ 35.8, నర్సాపూర్, వెల్దుర్తి 35.3, కుల్చారం 34.8, శివ్వంపేట, మనోహరాబాద్ 34.7°C జిల్లాలోని గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా వృద్దులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.