News March 19, 2025
ములుగు: అటవీ అధికారి తీరుకు ఏడుగురు బలి!

ములుగు జిల్లాలో ఓ అటవీ శాఖ అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏటూరునాగారంలో పని చేసిన ఓ రేంజర్ తునికాకు బోనస్ డబ్బులు కింది స్థాయి సిబ్బంది ఖాతాల్లో వేయించి, డ్రా చేయించాడు. ఈ విషయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఖాతాలో వేయించిన ఏడుగురిపై కేసు నమోదు కాగా, రేంజర్పై కేసు నమోదు కాలేదు. దీంతో కింది స్థాయి సిబ్బంది జైలుకు పోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు.
Similar News
News December 3, 2025
ముందుగా ఆర్డినెన్స్.. తర్వాత వీలిన నోటిఫికేషన్

గ్రేటర్ HYDలో మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి ఆర్డినెన్స్ రావాల్సి ఉంది. వీలీన ప్రక్రియను గవర్నర్ ఇప్పటికే ఆమోదించడంతో త్వరలో ఆర్డినెన్స్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆ తర్వాత 3 రోజులకు ఇందుకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వస్తుంది. ఇందుకోసం అధికారులు పేపర్వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వార్డుల విభజనకు సంబంధించి ప్రజాభిప్రాయం కూడా సేకరించనున్నారు.
News December 3, 2025
యాదాద్రి: రాజ్యాంగ నిర్మాత ఆశీస్సులతో నామినేషన్

రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా BSP మండలాధ్యక్షుడు నకిరేకంటి నరేశ్ మంగళవారం రాత్రి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యాంగ నిర్మాత డా.BR.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆశీస్సులు తీసుకుని నామినేషన్ కేంద్రం వరకు ర్యాలీగా వెళ్లారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. నియోజకవర్గ అధ్యక్షుడు గూని రాజు, పావురాల నరసింహ యాదవ్, మారయ్య, రాజు ఉన్నారు.
News December 3, 2025
సిరిసిల్ల: రెండో దశ.. పంచాయతీలకు 603 నామినేషన్లు

జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల కోసం 603 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 88 పంచాయతీలకు గాను చివరిరోజు మంగళవారం 292 నామినేషన్లు స్వీకరించగా మొత్తం నామినేషన్ల సంఖ్య 603కు చేరిందని అధికారులు తెలిపారు. 758 వార్డులకు గాను మంగళవారం 1,119 నామినేషన్లు రాగా మొత్తం 1,811 నామినేషన్లు అందినట్లు వివరించారు. నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించనున్నారు.


