News April 1, 2025
ములుగు: ఆందోళనలో ‘మావో’ కుటుంబాలు

ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలు నేలకొరుగుతున్నారు. ఇక్కడి నుంచి సుమారు 21 మంది కీలక నేతలు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర హోంశాఖ వివరాలు ఆరా తీసినట్లు తెలిసింది. ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న ఎన్ కౌంటర్లతో జిల్లాలోని వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఓరుగల్లు వాసులే ఉండడం గమనార్హం.
Similar News
News November 21, 2025
వేములవాడ: సాధారణ కుటుంబం నుంచి ఐపీఎస్..!

వేములవాడ <<18349816>>ఏఎస్పీగా<<>> నియమితులైన కొట్టే రిత్విక్ సాయి సామాన్య కుటుంబం నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగారు. వరంగల్కు చెందిన ఈయన.. శ్రీనివాస గురుకుల్ పాఠశాలలో టెన్త్ వరకు, HYDలో ఇంటర్, ఢిల్లీ శివనాడార్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్లో బీటెక్ చేశారు. 2023వ బ్యాచ్లో TG క్యాడర్ IPS అధికారిగా ఎంపికయ్యారు. తండ్రి రాధాకృష్ణారావు లైబ్రేరియన్, తల్లి గృహిణి, సోదరి వైద్యురాలిగా పనిచేస్తారు.
News November 21, 2025
హారతిని కళ్లకు అత్తుకుంటున్నారా?

చాలామంది హారతిని కళ్లకు అత్తుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడికి దిష్టి తీయడం కోసమే హారతి ఇస్తారని, దాన్ని కళ్లకు అత్తుకోకూడదని సూచిస్తున్నారు. ‘ఇంట్లో, చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి తీసినట్లే స్వామివారికి దృష్టి దోషం పోవడానికే హారతి ఇస్తారు. అందులో ఏ సానుకూల శక్తి ఉండదు. దిష్టి తీసిన గుమ్మడికాయను వదిలేసినట్లే హారతిని కూడా వదిలేయాలి’ అని వివరిస్తున్నారు.
News November 21, 2025
RRB-NTPC ఫలితాలు విడుదల

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.


