News March 5, 2025
ములుగు: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

నేడు ములుగు జిల్లా వ్యాప్తంగా జరగబోయే ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా పరీక్షా కేంద్రం సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు అన్నీ కూడా మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లరాదని తెలిపారు.
Similar News
News March 6, 2025
సీఎం ప్రచారం చేసినా దక్కని విజయం!

TG: KNR-MDK-NZB-ADB ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడం ఆ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. పార్టీ అధికారంలో ఉన్నా, సీఎం రేవంత్ ప్రచారం నిర్వహించినా సిట్టింగ్ స్థానంలో గెలవకపోవడంతో ఈ జిల్లాల్లో కాంగ్రెస్ హవా తగ్గిందా అనే చర్చ మొదలైంది. ఈ ఎన్నికలో గెలిచినా, ఓడినా తమకు పోయేదేం లేదని స్వయంగా రేవంత్ వ్యాఖ్యానించడమూ ఆ పార్టీ ఓటమికి కారణమైందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News March 6, 2025
గుంటూరు: గుడారాల పండుగకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

గుంటూరు గుడారాల పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు గుంటూరు డివిజన్ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే గుడారాల పండుగకు ఈనెల 5వ తేదీన ప్రత్యేక రైళ్లు గుంతకల్, రేణిగుంట, విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు చేరుకుంటాయి. తిరిగి 9న బయలు దేరుతుయని రైల్వే అధికారులు తెలిపారు.
News March 5, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 209 మంది గైర్హాజరు
>గురుకులంలో 400 సీట్లకు అప్లై చేసుకోండి: రంపచోడవరం పీవో
> ఈనెల కూడా పప్పు, పంచదార లేదు
>అల్లూరి సిగలో మరో జలపాతం
>పాడేరు: సివిల్స్ ఉచిత శిక్షణకు ధరఖాస్తుల ఆహ్వానం
>గంగవరం: సాగునీటి కోసం అన్నదాతల అవస్థలు
>అరకు: సెల్ఫ్ డిఫెన్స్ పై విద్యార్థులకు శిక్షణ
>కొత్తపుట్టు జంక్షన్ వద్ద 70 కిలోల గంజాయి స్వాధీనం