News February 17, 2025

ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించాలి: చిరంజీవి

image

ఉమ్మడి వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి పూల రవీందర్‌ను గెలిపించాలని రాష్ట్ర బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ చిరంజీవి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90% ఓటర్లు బహుజనులు ఉన్నారని, బహుజనుల ఓటు బహుజన అభ్యర్థులకే వేయాలని అన్నారు. పూల రవీందర్ గెలుపు కోరుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చిరంజీవి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Similar News

News September 16, 2025

శ్రీశైలంలో అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసోత్సవాలు

image

AP: శ్రీశైల మల్లన్న క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. OCT 24న మొదటి కార్తీక శుక్రవారం కృష్ణమ్మకు నది హారతి, NOV 1న గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం, 5న జ్వాలాతోరణం, ప్రతి సోమవారం లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. శని, అది, సోమ, పౌర్ణమి రోజులలో సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నారు. సాధారణ రోజులలో పరిమితంగా అనుమతిస్తారు.

News September 16, 2025

ADB: మొదలై వెంటనే ముగిసిన ఓ తల్లి విషాద గాథ..!

image

సిరికొండ మండలం బీంపూర్‌కు చెందిన తోడసం ఏత్మ భాయి(20) ప్రసవం తర్వాత మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈనెల 12న పురిటి నొప్పులతో ఆమెను ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, బాలుడికి జన్మనిచ్చింది. 14వ తేదీన డిశ్చార్జ్ అయ్యాక తీవ్రమైన తలనొప్పి రావడంతో 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News September 16, 2025

నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. MSC స్టాటిస్టిక్స్‌లో 45 మందికి గాను.. 44 మంది మంది ఉత్తీర్ణులయ్యారు. బయోకెమిస్ట్రీలో 24 మందిలో 17 మంది ఉత్తీర్ణులయ్యారని అధికారులు తెలిపారు. ఫలితాలపై అభ్యంతరాలున్నవారు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. రీవాల్యూయేషన్‌ కోసం రూ.1860, వ్యక్తిగత పేపర్‌ వెరిఫికేషన్‌ కోసం రూ.2190 చెల్లించాలన్నారు.