News February 18, 2025
ములుగు: ‘ఎస్సై వేధిస్తున్నాడు.. ఆత్మహత్యకు అనుమతించండి’

ములుగు జిల్లాకు చెందిన ఓ ఎస్సై, అతడి కుటుంబీకులు వేధింపులకు గురిచేస్తున్నారని, ఆత్మహత్యకు అనుమతించాలని మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన- ప్రతాప్ రెడ్డి దంపతులు భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.దంపతులకు గ్రామంలో ఉన్న 12 ఎకరాల భూమికి చెందిన బండ్ల బాటను ఎస్సై, అతడి కుటుంబీకులు 2022 మే 15న దున్ని వారి భూమిలో కలుపుకొన్నారన్నారు. కేసులు పెట్టి ఇబ్బందికి గురిచేస్తున్నారన్నారు.
Similar News
News November 12, 2025
NZB: ఈ నెల 20 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

TU పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో B.A/B.Com/B.Sc/BBA/BCA 1,3,5 రెగ్యులర్, 2,4,6 బ్యాక్ లాగ్ (2021-2025) సెమిస్టర్ల డిగ్రీ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం డిగ్రీ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈనెల 20 నుంచి డిసెంబర్ 10 వరకు ఉదయం 9గం. నుంచి 12గం. వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
News November 12, 2025
AP న్యూస్ రౌండప్

* స్వచ్ఛ కార్యక్రమాల అమలులో విశాఖ పోర్టు అథారిటీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ముంబైలో కేంద్ర మంత్రి సర్బానంద చేతుల మీదుగా పోర్టు ఛైర్మన్ అంగముత్తు అవార్డు స్వీకరించారు.
* రేపటి నుంచి సత్యసాయి శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. 19న PM మోదీ, 22న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, 23న రాష్ట్రపతి ముర్ము హాజరుకానున్నారు.
* వర్సిటీలన్నింటికీ ఒకే చట్టం తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు తుదిదశకు చేరుకుంది.
News November 12, 2025
GNT: ఫోన్ కోసం యువకుడి ఆత్మహత్య..!

అప్పులు చేసి ఫోన్లు కొనడం, మద్యం మత్తులో వాటిని పగలకొట్టడంతో తల్లిదండ్రులు మందలించారని డేరంగుల అంజి (19) ఎలుకల మందుతిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ఆర్ కాలనీకి చెందిన అంజి రెండు ఫోన్లను పగలకొట్టాడు. మరోఫోన్ అడగడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఈ నెల 2న కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలిపి తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని పోలీసులు తెలిపారు.


