News February 9, 2025

ములుగు: గుప్పుమంటున్న గుడుంబా

image

కన్నాయిగూడెం మండలంలో గుడుంబా గుప్పుమంటుంది. పలు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో గుడుంబా విక్రయ, తయారీదారులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ గుడుంబా మహమ్మారి అడ్డుకట్ట పడడం లేదన్నారు. బుట్టాయిగూడెంలోని ఓ ప్రాంతంలో గుడుంబా తాగి స్పృహ కోల్పోయి కాల్వలో పడిన ఓ వ్యక్తి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Similar News

News February 28, 2026

కృష్ణా: రేషన్ మాఫియా మాయాజాలం!

image

విజయవాడ సహా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా రాజకీయ అండతో రెచ్చిపోతోందనే విమర్శలొస్తున్నాయి. పేదల బియ్యంపై ఏకంగా వేలం పాటలు నిర్వహిస్తూ, గెలిచిన వారు ప్రజాప్రతినిధులకు నెలకు రూ.10 నుంచి 15లక్షల వరకు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాము అనే వ్యక్తి సిండికేట్‌గా మారి రేషన్ విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. పేదల పొట్ట కొట్టి ఇలా వ్యాపారం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News February 28, 2026

గద్వాల్: అదృశ్యమైన యువకుడి సూసైడ్..!

image

గద్వాల మండలం గుంటుపల్లికి చెందిన బొల్లెద్దుల రోహిత్ (24) ఇటీవల అదృశ్యం కాగా అతడి తండ్రి బొల్లెద్దుల జానీ తన కుమారుడు కనిపించడం లేదని ఈనెల 25న గద్వాల పీఎస్‌లో కంప్లైంట్ చేశాడు. అయితే రోహిత్ ప్రేమించిన అమ్మాయి తరఫు బంధువుల వేధింపు వల్ల సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై రోహిత్ తండ్రి జానీ శనివారం హైదరాబాద్ నాచారం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News February 28, 2026

శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా రూపలత

image

శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిగా (ఐసీడీఎస్ పీడీ) కె.రూపలత శనివారం నియమితులయ్యారు. ప్రస్తుతం రణస్థలం మండలం సీడీపీవోగా విధులు నిర్వర్తిస్తున్న ఈమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో పీడీగా పనిచేసిన జయదేవి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆమెకు కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.