News May 11, 2024

ములుగు: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

బావిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ రోడ్ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. తెలుపు రంగు పుల్ బనియన్, బ్లూ రంగు చెక్స్ డిజైన్ గీతల లుంగీతో మృతదేహాం ఉందన్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే ములుగు పోలీసులను సంప్రదించాలని కోరారు.

Similar News

News February 18, 2025

వరంగల్: టూరిస్టుల కోసం స్పెషల్ బస్సు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రదేశాల సందర్శన కోసం టూరిజం సంస్థ ప్రత్యేక ఏసీ బస్సును ఏర్పాటు చేసింది. ఈనెల 20న ఉదయం 7.45కు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి బస్సు ప్రారంభమవుతుంది. వేయి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, రామప్ప, లక్నవరం, రాత్రి ఖిలా వరంగల్ సందర్శన అనంతరం రాత్రి 8 గంటలకు హన్మకొండకు చేరుకుంటుంది. పెద్దలకు రూ.980లు, పిల్లలకు రూ.790లుగా టికెట్ ధర నిర్ణయించారు.

News February 18, 2025

నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

నర్సంపేట -పాకాల మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అశోక్ నగర్‌కు చెందిన వెంకటేశ్ నర్సంపేటలో షాపులో పని చేస్తుండేవాడు. సోమవారం రాత్రి పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళుతున్న క్రమంలో ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2025

వరంగల్ మార్కెట్‌లో తటస్థంగా పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు రైతన్నలకు నిరాశ కలిగిస్తున్నాయి. రోజురోజుకు ధర తగ్గుతూ ఉండటంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. సోమవారం రూ.6,800 పలికిన క్వింటా పత్తి ధర.. ఈరోజు సైతం అదే ధర పలికింది. గత వారం రూ.7,200 పైగా ధర పలకగా, ప్రస్తుతం క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

error: Content is protected !!