News April 2, 2025

ములుగు: చర్చలకు మేము సిద్ధం.. ‘మావో’ లేఖ

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలకు మేము సిద్ధమేనని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ములుగు జిల్లాలో ఓ లేఖ చెక్కర్లు కొడుతుంది. ఛతీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో చేపట్టిన ‘కగార్’ వెంటనే విరమించాలని, బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపేయాలని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ప్రతిపాదనలకు స్పందిస్తే తక్షణమే కాల్పులు విరమిస్తామన్నారు.

Similar News

News November 28, 2025

HYD: అభివృద్ధికి నిదర్శనంగా ఆదిబట్ల !

image

ఆదిబట్ల మున్సిపాలిటీ హైదరాబాద్ అభివృద్ధికి నిదర్శనంగా మారింది. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న ఆదిభట్ల మున్సిపాలిటీ ప్రస్తుతం మినీ గచ్చిబౌలిగా పేరుగాంచింది. IT సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాలకు నిలయంగా ఉంది. మాజీ సీఎం YS రాజశేఖర్ రెడ్డితో ఆదిభట్లకు ప్రాధాన్యం పెరిగింది. ఆయన హయాంలోనే ప్రతిష్టాత్మకమైన టాటా సంస్థను ఇక్కడికి తీసుకొచ్చారు. కాగా, అప్పటి ఆదిత్యనగర్ కాస్త కాలక్రమంగా ఆదిభట్లగా పేరు పొందింది.

News November 28, 2025

మదనపల్లె: తగ్గు ముఖం పడుతున్న టమాటా ధరలు

image

మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్కెట్‌కు శుక్రవారం 180 మెట్రిక్ టన్నుల పంట వచ్చినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. వాటిలో మొదటి రకం టమాటాలు 10 కిలోలు రూ.480 పలకగా రెండో రకం రూ. 450, మూడో రకం రూ.400 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారన్నారు.

News November 28, 2025

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: పవన్

image

AP: కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని Dy.CM పవన్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయన్నారు. ఇవాళ్టి కార్యక్రమం భవనాలకే కాకుండా ఏపీ భవిష్యత్తుకు పడిన పునాది అని పేర్కొన్నారు.