News January 30, 2025
ములుగు: చలిమంటల్లో పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

చలి మంటల్లో పడి విద్యార్థి కాళ్లకు తీవ్ర గాయాలైన ఘటన ములుగు జల్లా ఏటూరునాగారం మండలం మల్యాల ఆశ్రమ పాఠశాలలో గురువారం రాత్రి జరిగింది. 3వ తరగతి చదువుతున్న భూదేశ్ అనే గుత్తికోయ విద్యార్థి చలి వేస్తుందని పాఠశాల ఆవరణలో చలిమంటల కోసం ఎండు గడ్డికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో అదుపుతప్పి భూదేశ్ మంటల్లో పడగా 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 15, 2025
DSSSBలో 1180 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఢిల్లీలో 1180 అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ) పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్, DEd లేదా B.EI.Ed, సీటెట్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100, ST, SC, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. రాతపరీక్ష ద్వారా ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 15, 2025
కర్నూలులో రేపు ట్రాఫిక్ మళ్లింపు

రేపు ప్రధాని <<18009233>>మోదీ<<>> కర్నూలు పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మార్గాలు మళ్లింపు ఉంటాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కడప నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు కొల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా మార్గంలో వెళ్లాలని సూచించారు. ఇతర ప్రాంతాల వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను అనుసరించాలని తెలిపారు.
News October 15, 2025
కేతిరెడ్డి పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

తాడిపత్రికి వెళ్లినప్పటికీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో మిసిలేనియస్ అప్లికేషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఇప్పటికే మీకు రక్షణ కల్పించాం, ఇంకేం కావాలి?’ అంటూ న్యాయమూర్తులు ప్రశ్నించారు. అనంతరం కేతిరెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు.