News January 30, 2025
ములుగు: చలిమంటల్లో పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

చలి మంటల్లో పడి విద్యార్థి కాళ్లకు తీవ్ర గాయాలైన ఘటన ములుగు జల్లా ఏటూరునాగారం మండలం మల్యాల ఆశ్రమ పాఠశాలలో గురువారం రాత్రి జరిగింది. 3వ తరగతి చదువుతున్న భూదేశ్ అనే గుత్తికోయ విద్యార్థి చలి వేస్తుందని పాఠశాల ఆవరణలో చలిమంటల కోసం ఎండు గడ్డికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో అదుపుతప్పి భూదేశ్ మంటల్లో పడగా 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 18, 2025
గంభీరావుపేట: PG స్పాట్ అడ్మిషన్స్కు నేడే ఆఖరు

గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో నేడు పీజీ స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. M.COM, M.SC కంప్యూటర్ సైన్స్లో అడ్మిషన్స్కు అవకాశం ఉందని, ఆసక్తిగల విద్యార్థిని, విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో కళాశాలలో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేశారు.
News November 18, 2025
గంభీరావుపేట: PG స్పాట్ అడ్మిషన్స్కు నేడే ఆఖరు

గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో నేడు పీజీ స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. M.COM, M.SC కంప్యూటర్ సైన్స్లో అడ్మిషన్స్కు అవకాశం ఉందని, ఆసక్తిగల విద్యార్థిని, విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో కళాశాలలో సంప్రదించాలని సూచించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని స్పష్టం చేశారు.
News November 18, 2025
NLG: మిల్లు బయటే వారం రోజులుగా ధాన్యం లారీ

నల్గొండ(M) శేషమ్మగూడెం PACS ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తిప్పర్తి(M) అనిశెట్టి దుప్పలపల్లిలోని మిల్లు బయటే వారం రోజులుగా నిలిచిపోయింది. ధాన్యం లోడును మిల్లుకు తరలించగా, బాగా లేదనే కారణంతో మిల్లు యాజమాన్యం తిరస్కరించింది. 7 రోజులుగా ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు వాపోయారు. వర్షం వస్తే ధాన్యం పరిస్థితి ఏంటని దిగులు చెందుతున్నారు.


