News January 30, 2025

ములుగు: చలిమంటల్లో పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

image

చలి మంటల్లో పడి విద్యార్థి కాళ్లకు తీవ్ర గాయాలైన ఘటన ములుగు జల్లా ఏటూరునాగారం మండలం మల్యాల ఆశ్రమ పాఠశాలలో గురువారం రాత్రి జరిగింది. 3వ తరగతి చదువుతున్న భూదేశ్ అనే గుత్తికోయ విద్యార్థి చలి వేస్తుందని పాఠశాల ఆవరణలో చలిమంటల కోసం ఎండు గడ్డికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో అదుపుతప్పి భూదేశ్ మంటల్లో పడగా 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 7, 2025

శ్రీసత్యసాయి: తల్లిదండ్రుల మృతి.. అనాథలైన ఇద్దరమ్మాయిలు

image

పరిగిలో అమ్మానాన్నలు మృతి చెందడంతో వారి ఇద్దరి అమ్మాయిలు అనాథలయ్యారు. ఎనిమిదేళ్ల క్రితం తల్లి మరణించగా.. శనివారం తెల్లవారుజామున తండ్రి భజంత్రీ గోపాల్ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో వారి కుమార్తెలు ఇద్దరూ అనాథలయ్యారు. మండల పాత్రికేయులు తమ వంతుగా ఆ బాలికలకు ఆర్థిక సాయం అందజేసి, భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తోడుంటామని భరోసా కల్పించారు.

News December 7, 2025

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్‌తో మహిళ మృతి.. కానీ!

image

ప్రకాశం జిల్లాలో ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి పాజిటివ్ వచ్చిన మహిళ మృతి చెందినట్లు ప్రకాశం DMHO వెంకటేశ్వర్లు తెలిపారు. యర్రగొండపాలెం మండలానికి చెందిన వృద్ధురాలు గతనెల 11న అనారోగ్యానికి గురైంది. అయితే మెరుగైన చికిత్స కోసం గుంటూరు GGHకు తరలించారు. 29న అక్కడ నిర్వహించిన <<18481778>>టెస్టుల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్<<>> వచ్చిందన్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా మృతికి కారణంగా డీఎంహెచ్వో తెలిపారు.

News December 7, 2025

సదుంలో సినిమా షూటింగ్

image

సదుం మండలంలోని తాటిగుంటపాలెంలో ‘నాన్న డైరీ’ సినిమా షూటింగ్ మూడు రోజులుగా జరుగుతోంది. క్లైమాక్స్ సంబంధించిన పలు దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు డైరెక్టర్ సురేశ్, నిర్మాత కోటి తెలిపారు. మరో మూడు రోజుల పాటు షూటింగ్ కొనసాగితే చిత్రీకరణ పూర్తి అవుతుందని వారు చెప్పారు. చిత్రంలో పీలేరుకు చెందిన ఖాదర్ బాషా, షాను, సన, సదుంకు చెందిన రచయిత, కళాకారుడు రామయ్య నటిస్తున్నట్లు వెల్లడించారు.