News January 30, 2025
ములుగు: చలిమంటల్లో పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

చలి మంటల్లో పడి విద్యార్థి కాళ్లకు తీవ్ర గాయాలైన ఘటన ములుగు జల్లా ఏటూరునాగారం మండలం మల్యాల ఆశ్రమ పాఠశాలలో గురువారం రాత్రి జరిగింది. 3వ తరగతి చదువుతున్న భూదేశ్ అనే గుత్తికోయ విద్యార్థి చలి వేస్తుందని పాఠశాల ఆవరణలో చలిమంటల కోసం ఎండు గడ్డికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో అదుపుతప్పి భూదేశ్ మంటల్లో పడగా 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 24, 2026
రాష్ట్రంలో రూ.549కోట్ల మోసం.. ఏం జరిగిందంటే?

TG: ఖమ్మంలో రూ.500కోట్ల సైబర్ స్కామ్ సంచలనంగా మారింది. సత్తుపల్లికి చెందిన వికాస్ చౌదరి, మరికొందరు ఇంటర్నేషనల్ సైబర్ క్రిమినల్స్తో కలిసి రూ.549కోట్లకు పైగా కొల్లగొట్టారు. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, బెట్టింగ్, గేమింగ్, క్రిప్టో కరెన్సీ పేరిట అమాయకులను మోసం చేశారు. ఈ స్కామ్కు సంబంధించి పోలీసులు ఇప్పటికే 18 మందిని రిమాండ్కు పంపగా, కీలక నిందితుడు వికాస్ తాజాగా లొంగిపోయినట్లు తెలుస్తోంది.
News February 24, 2026
రాజమండ్రి: పాల కల్తీకి కారణం ‘కూలెంట్’ లీకేజీ!

కలకలం రేపిన కల్తీ పాల ఘటనకు కారణాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. గణేశ్ కూలింగ్ ఛాంబర్లో మరమ్మతులు చేస్తుండగా, ఫ్రిడ్జ్లోని ‘ఇథిలీన్ గ్లైకాల్’ అనే కూలెంట్ లీకై పాలలో కలిసినట్లు నిర్ధారించినట్లు సమాచారం. వరలక్ష్మీ డెయిరీ పేరుతో అనధికారికంగా ఈ కేంద్రం నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. వారం క్రితమే ఈ లీకేజీ జరిగినట్లు సమాచారం. బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నారు.
News February 24, 2026
కామారెడ్డి జిల్లాలో మార్కెట్లో కూరగాయల ధరలు

కామారెడ్డి జిల్లాలో మార్కెట్లో మంగళవారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో చొప్పున టమాటా రూ.10, గోరుచిక్కుడు రూ. 50, బెండకాయ రూ. 50, దోసకాయ రూ. 40, బీరకాయ రూ. 60, ఆలుగడ్డ రూ. 30, క్యారెట్ రూ. 50, బీట్ రూట్ రూ. 50, పచ్చిమిర్చి రూ. 60, పాలకూర రూ. 40, వంకాయ రూ. 40, దొండకాయ రూ. 50, చిక్కుడుకాయ రూ. 50, ఉల్లిగడ్డ రూ. 30, ఎల్లిగడ్డ రూ. 200కు విక్రయిస్తున్నారు.


