News March 10, 2025
ములుగు జిల్లాకు రూ.200 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలోని ములుగు నియోజకవర్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 16, 2025
ఎన్టీఆర్ జిల్లా టుడే టాప్ న్యూస్

★ రేపటి నుంచి పది పరీక్షలు ప్రారంభం
★ జిల్లాలో పరీక్ష రాయనున్న 31,231 మంది విద్యార్థులు
★విజయవాడలో కోడి పందేలపై దాడి.. ఏడుగురు అరెస్ట్
★ జిల్లాలో ఘనంగా పొట్టిశ్రీరాములు జయంతి
★ విజయవాడలో సందడి చేసిన రాబిన్హుడ్ చిత్ర బృందం
★ IBM ఫెర్రీలో గుర్తుతెలియని మృతదేహం గుర్తింపు
★ జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
★ జిల్లాలో హడలెత్తిస్తున్న ఎండలు
News March 16, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

★ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలి: కలెక్టర్
★ కోనేరు సెంటర్ను ఐకానిక్ సెంటర్గా తీర్చిదిద్దుతాం: కొల్లు
★ కృష్ణా జిల్లా వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
★ కృష్ణా జిల్లాలో భానుడి భగభగలు
★ గన్నవరం ఎయిర్ఫోర్ట్ నుంచి విజయవాడ వెళ్లిన హీరో నితిన్
★ మచిలీపట్నంలో పేర్ని నానిని కలిసిన వైసీపీ నేతలు
★ గన్నవరంలో టీడీపీ కార్యాలయం ప్రారంభం
News March 16, 2025
ఈ నెల 18న ఢిల్లీకి చంద్రబాబు!

AP: ఈ నెల 18న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమరావతి పనుల పునఃప్రారంభానికి రావాలని ఆయనను ఆహ్వానించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ఇతర అంశాలపై ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.