News March 22, 2025
ములుగు జిల్లాకే తల మాణికం రామప్ప చెరువు!

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలో గల కాకతీయుల కాలం నాటి రామప్ప సరస్సు జిల్లాకే తలమానికం అని చెప్పవచ్చు. సుమారు 6000 ఎకరాల్లో పంటలకు సాగునీరు నందిస్తూ, నాలుగు మండలాలకు తాగునీరును అందించడమే కాక ఈ సరస్సులోని నీటిని గణపసముద్రం, పాకాల సరస్సులకు తరలిస్తున్నారు. రామప్ప సరస్సును రిజర్వాయర్గా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నది. (నేడు ప్రపంచ జల దినోత్సవం)
Similar News
News November 19, 2025
HYD: ప్లాస్టిక్ బాటిల్స్, పాత్రలు వాడుతున్నారా?

ప్రతిచోట ప్లాస్టిక్ కామన్ అయిపోయింది. మైక్రోప్లాస్టిక్స్తో మానవ శరీరంలో క్యాన్సర్స్, లీకీగట్, ఆహారాన్ని జీర్ణాశయం శోషించుకోలేకపోవడం వంటివి సైంటిస్టులు గుర్తించారు. HYDలో ప్రతి ఒక్కరి కడుపులోకి 0.8% మైక్రోప్లాస్టిక్ వెళ్తున్నట్లు ‘హెల్త్ మైక్రో ప్లాస్టిక్ కవరేజ్’ వెల్లడించింది. ప్లాస్టిక్కు వేడి తగిలితే నానోపార్టికల్స్ రిలీజ్ అవుతాయని, పింగాణీ, స్టీల్, ఇత్తడి, మట్టిపాత్రలు వాడాలని సూచించింది.
News November 19, 2025
కర్నూలు: రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగాలు

ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. డిప్లొమా/ఐటీఐ అర్హతతో 24 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఉద్యోగానికి ఎంపికైతే వార్షిక వేతనం రూ.3 లక్షలు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు www.ncs.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
News November 19, 2025
చిత్తూరు రైతులకు నేడు రూ.136.46 కోట్ల జమ

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.


