News March 22, 2025
ములుగు జిల్లాకే తల మాణికం రామప్ప చెరువు!

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేటలో గల కాకతీయుల కాలం నాటి రామప్ప సరస్సు జిల్లాకే తలమానికం అని చెప్పవచ్చు. సుమారు 6000 ఎకరాల్లో పంటలకు సాగునీరు నందిస్తూ, నాలుగు మండలాలకు తాగునీరును అందించడమే కాక ఈ సరస్సులోని నీటిని గణపసముద్రం, పాకాల సరస్సులకు తరలిస్తున్నారు. రామప్ప సరస్సును రిజర్వాయర్గా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నది. (నేడు ప్రపంచ జల దినోత్సవం)
Similar News
News October 19, 2025
నారాయణపేట: టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా శివవీరరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులైన తీన్మార్ మల్లన్న నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన శివ వీర రెడ్డికు తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా వాసి శివ వీర రెడ్డికి TRP రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
News October 19, 2025
దూడలలో తెల్లపారుడు వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

తెల్లపారుడు వ్యాధిని కలిగించే ఇ.కోలి క్రిమి సహజంగా దూడ పేగులలో ఉంటుంది. దూడలు అపరిశుభ్రమైన పొదుగు లేదా పాత్రలలో పాలు తాగినప్పుడు, ఒక్కసారిగా ఎక్కువగా పాలు తాగినప్పుడు, వెన్న ఎక్కువగా ఉన్న చివరి పాలు తాగినప్పుడు, పాలు తాగే సమయాలలో తేడా ఉన్నప్పుడు, జున్నుపాలు సరిగా తాగనప్పుడు, దూడల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు.. దూడ పేగుల్లోని హానికర ఇ.కోలి సంఖ్య పెరిగి తెల్లపారుడు వ్యాధి కలుగుతుంది.
News October 19, 2025
ముంచంగిపుట్టు: ఇంకెన్నాళ్లు ఈ కష్టాలు..!

ముంచంగిపుట్టు మండలం అడాలపుట్టుకు రోడ్డు సదుపాయం లేదు. రాళ్లతో కూడిన ఎగుడు దిగుడు రహదారిలో ప్రయాణిస్తూ గెడ్డ దాటితేనే బయటకు వెళ్లగలరు. తాజాగా గ్రామానికి చెందిన గొల్లోరి పరశురామ్ అనారోగ్యానికి గురయ్యారు. విధిలేని పరిస్థితుల్లో బంధువులు ఆయనను వీపు మీద మోస్తూ గడ్డ దాటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వం స్పందించి తమకు రోడ్డు సౌకర్యం, బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.