News February 21, 2025

ములుగు జిల్లాలో అటవీశాఖ ఫాస్టాగ్ ప్రారంభం

image

రాష్ట్రంలోనే మొదటిసారిగా ములుగు జిల్లాలో అటవీశాఖ పర్యావరణ రుసుము ఫాస్టాగ్ తరహాలో వసూలుకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఏటూరునాగారం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద మాదిరి వాహనాల నుంచి రుసుము వసూలు చేస్తున్నారు. ఏటూరునాగారం-పస్రా వరకు 3 ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. గూడ్స్ వాహనాలకు రూ.200 కార్లకు రూ.50 ఇతర వాహనాలను బట్టి రుసుము ఉంటుందన్నారు.

Similar News

News March 23, 2025

సూర్యాపేట: విద్యుత్ ఘాతంతో రైతు మృతి

image

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చిన్న నెమిలలో విద్యుదాఘాతంలో రైతు మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలిలా.. యాట సైదులు (55) ఆదివారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి కరెంట్ షాక్‌కు గురయ్యాడు.చికిత్స కోసం సూర్యాపేట తీసుకెళ్లి మెరుగైన వైద్యం కోసం HYD ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశాడు.  సైదులు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

News March 23, 2025

నెల రోజులైనా లభించని కార్మికుల ఆచూకీ

image

SLBC టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకొని నెల దాటింది. అయినా ఇప్పటివరకు ఒకరి మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడంలేదు. దీంతో సహాయక చర్యలపై NDRF, SDRF, ఆర్మీ తదితర విభాగాలతో TG CM రేవంత్ రెడ్డి రేపు సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది.

News March 23, 2025

ఆదిలాబాద్‌: రేపటి నుంచి 6రోజుల పాటు శిక్షణ

image

ఆదిలాబాద్‌లోని TTDCలో విపత్తు నిర్వహణపై ఈ నెల 24 నుంచి 29 వరకు మర్రి చెన్నారెడ్డి ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 18 నుంచి 40 సం.రాల వయస్సు లోపు పది పాసైన 50 మందికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. టిఫిన్, భోజనం ఖర్చులకు వంద రూపాయలతో పాటు రాత్రి వసతి కూడా ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!