News January 24, 2025
ములుగు జిల్లాలో గంజాయి పట్టివేత

ములుగు జిల్లా మంగపేట మండలంలో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కమలాపురంలో శుక్రవారం ఉదయం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.63 వేల విలువ చేసే 2.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాజేడు మండలం వెంకటాపురంకు చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 9, 2025
తూ.గో: విదేశీ ఉద్యోగాల ఎర.. రూ.4 కోట్లకు టోకరా

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి రూ. 4 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం నిడదవోలు మండలం గోపవరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. యంట్రపాటి విజయలక్ష్మి, భాగ్యం తదితరులు తమను నిండా ముంచారని బాధితులు వాపోయారు. డబ్బులు తిరిగి అడిగితే ముఖం చాటేస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్, జిల్లా జడ్జికి వారు ఫిర్యాదు చేశారు.
News December 9, 2025
భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్లు

వరంగల్ భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్ల బాగోతం బయటకు వచ్చింది. ఇద్దరు ఉద్యోగులు ఒకే సీరీస్ నంబర్లున్న టికెట్లను భక్తులకు విక్రయించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. కాజీపేటకు చెందిన భక్తుడు నకిలీ టికెట్లు ఉన్నాయంటూ ఆలయం ఈవో రామల సునీతకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆలయ బోర్డులో చర్చించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈవో పేర్కొన్నారు. నకిలీ టికెట్ల విక్రయం భద్రకాళి ఆలయంలో చర్చనీయాంశమైంది.
News December 9, 2025
చివ్వెంలలో తెల్లవారుజామున భారీ పేలుడు

చివ్వెంల మండల పరిధిలో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. బ్రిక్స్ యూనిట్లోని పీడన ఫోమ్ తయారీ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగిందని స్థానికులు తెలిపారు. పేలుడు శబ్దం భారీగా ఉండడంతో సమీపంలోని బీబీగూడెం, మున్యా నాయక్ తండా ప్రజలు ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు తండోపతండాలుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు.


