News January 24, 2025

ములుగు జిల్లాలో గంజాయి పట్టివేత

image

ములుగు జిల్లా మంగపేట మండలంలో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కమలాపురంలో శుక్రవారం ఉదయం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.63 వేల విలువ చేసే 2.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాజేడు మండలం వెంకటాపురంకు చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 20, 2025

నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

image

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1973: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

News November 20, 2025

నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

image

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1973: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

News November 20, 2025

తెలుగు ప్రాక్టీస్ చేస్తున్నా: ప్రియాంకా చోప్రా

image

‘వారణాసి’ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు తెలుగు నేర్చుకుంటున్నట్లు హీరోయిన్ ప్రియాంకా చోప్రా తెలిపారు. ఇన్‌‌స్టాలో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. తాను కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు తన మాతృభాష కాదని, ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి సాయం చేస్తున్నారని ఇటీవల అన్నారు. రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి 2027 సమ్మర్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.