News April 15, 2025

ములుగు జిల్లాలో గుడుంబా కేసులెన్నో తెలుసా?

image

గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ములుగు ఎస్పీ శబరీశ్ అన్నారు. జిల్లాలో గత ఏడాది 2024లో గుడుంబా తయారీ, విక్రయ దారులపై 184 కేసులు నమోదు చేసి, 3023 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 216 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 10 వరకు 62 కేసులు నమోదు చేసి, 1426 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామన్నారు. 62 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News December 3, 2025

కోకాపేటలో ఎకరం రూ.131 కోట్లు

image

కోకాపేట్ నియోపోలిస్ భూముల‌ వేలం ముగిసింది. న‌గ‌రానికి చెందిన యూలా గ్రూప్ నాలుగు ఎక‌రాల ప్లాటును వేలంలో సొంతం చేసుకుంది. ఎక‌రానికి రూ.131 కోట్లు వెచ్చించింది. నియోపోలిస్ నుంచి గండిపేట్ వ్యూ క‌నిపిస్తుండ‌టంతో ఇక్క‌డి క‌మ్యూనిటీని డెవ‌ల‌ప్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని, అందుకే ఈ నాలుగు ఎక‌రాలను ఆన్‌లైన్ వేలంలో యూలా గ్రూప్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.

News December 3, 2025

కోకాపేటలో ఎకరం రూ.131 కోట్లు

image

కోకాపేట్ నియోపోలిస్ భూముల‌ వేలం ముగిసింది. న‌గ‌రానికి చెందిన యూలా గ్రూప్ నాలుగు ఎక‌రాల ప్లాటును వేలంలో సొంతం చేసుకుంది. ఎక‌రానికి రూ.131 కోట్లు వెచ్చించింది. నియోపోలిస్ నుంచి గండిపేట్ వ్యూ క‌నిపిస్తుండ‌టంతో ఇక్క‌డి క‌మ్యూనిటీని డెవ‌ల‌ప్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని, అందుకే ఈ నాలుగు ఎక‌రాలను ఆన్‌లైన్ వేలంలో యూలా గ్రూప్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.

News December 3, 2025

బంగారిగడ్డ ఎన్నికలు.. ఫిర్యాదుతో యథావిధిగా పోలింగ్

image

చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైంది. అభ్యర్థిని ఏకగ్రీవంగా నిర్ణయించినా, కొందరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను ఎంపిక చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. త్వరలో పోలింగ్ నిర్వహించనున్నారు.