News April 15, 2025

ములుగు జిల్లాలో గుడుంబా కేసులెన్నో తెలుసా?

image

గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ములుగు ఎస్పీ శబరీశ్ అన్నారు. జిల్లాలో గత ఏడాది 2024లో గుడుంబా తయారీ, విక్రయ దారులపై 184 కేసులు నమోదు చేసి, 3023 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 216 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 10 వరకు 62 కేసులు నమోదు చేసి, 1426 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామన్నారు. 62 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News September 18, 2025

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

image

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. అనుకోకుండా ఉగ్రవాదులు దాడులు జరిపినప్పుడు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఈ మాక్ డ్రిల్ చేశారు. ఆలయంలోనూ, కొండపైన, పరిసరాల్లో ఆక్టోపస్, పోలీస్, అగ్నిమాపక, రెవిన్యూ, వైద్య, దేవస్థానం సిబ్బంది ఈ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు.

News September 18, 2025

పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పాటశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో మండలాల వారిగా, పాఠశాల సముదాయాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా ఆగస్టు నెల సగటు విద్యార్థుల హాజరు నివేదికలు, టాప్ 5 పాఠశాలలు, అట్టడుగు 5 పాఠశాలలు, పాఠశాల కాంప్లెక్స్ వారీగా సమస్యలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు.

News September 18, 2025

భద్రాచలం: డ్రిల్ బిట్‌ను మింగిన బాలుడు

image

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి బాలుడి ప్రాణాలు కాపాడారు. ఎటపాక మండలం చోడవరానికి చెందిన గౌతమ్‌(8) ఆడుకుంటూ డ్రిల్ బిట్‌ను మింగాడు. అది పేగులో ఇరుక్కోవడంతో బాలుడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డాడు. కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మూడు గంటలపాటు శ్రమించి డ్రిల్ బిట్‌ను బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు.