News January 23, 2025

ములుగు జిల్లాలో గ్రామ సభల గ్రీవెన్స్ అప్డేట్

image

ములుగు జిల్లాలోని 9 మండలాల్లో గురువారం వరకు గ్రీవెన్స్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులు వివరాలను అధికారులు వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులకు 9455, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 6,823, రైతు భరోసాకు 627, ఇందిరమ్మ ఇండ్లకు 9842, గ్రీవెన్స్ దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లాలో శుక్రవారం కూడా గ్రామ సభలు జరగనున్నాయి.

Similar News

News October 30, 2025

మేడిపల్లిలో ACBకి చిక్కిన విద్యుత్ అధికారి

image

యాదరిగిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విద్యుత్ శాఖ SE వెంకటరామారావు HYD శివారు మేడిపల్లిలో లంచం తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడ్డాడు. మేడిపల్లికి చెందిన ఓ వ్యక్తికి యాదాద్రి ఆలయ పులిహోర యంత్రాల నిర్వహణ కాంట్రాక్టు దక్కింది. రూ.10 లక్షల బిల్లుల మంజూరుకు వెంకటరామారావు 20% లంచం డిమాండ్ చేశాడు. మేడిపల్లి మారుతీనగర్‌లో రూ.1.90 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు.

News October 30, 2025

నిజామాబాద్: వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

image

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాల్కొండ మండలం బోదెపల్లికి చెందిన సుధాకర్(48) తన TVS ఎక్సెల్ వాహనంపై ఆర్మూర్ వైపు వస్తుండగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అతడి వాహనాన్ని పెర్కిట్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ ఎదుట గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందగా పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 30, 2025

కురిచేడు: వాగులో చిక్కుకున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు

image

పొంగిన వాగులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిక్కుకుంది. ఈ ఘటన కురిచేడు మండలం వెంగాయపాలెం గ్రామం వద్ద చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తున్న సమయంలో గుండ్లకమ్మ వాగు ఒక్కసారిగా తన విశ్వరూపం చూపటంతో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాక్టర్, తాళ్ల సహాయంతో బస్సును బయటికి తీసి ప్రయాణికులను కాపాడారు.