News April 22, 2025
ములుగు జిల్లాలో దారుణం.. వ్యక్తి హత్య!

ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడం సాయి ప్రకాశ్ ఈ నెల 15న హనుమకొండలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. పోలీసులు విచారణ చేపట్టగా ఓ కానిస్టేబుల్ సుపారి గ్యాంగ్తో కలిసి సాయి ప్రకాశ్ను హత్య చేసినట్లు తెలిసింది. మండలంలో ఎంతోమంది గర్భిణులకు, దివ్యాంగులకు, వృద్ధులకు, ఆదివాసులకు సేవ చేసిన సాయి ప్రకాశ్ మృతితో మండలంలో విషాదం నెలకొంది.
Similar News
News April 22, 2025
సివిల్స్ ర్యాంక్ కొట్టిన షాద్నగర్ యువతి

UPSCలోనూ మన రంగారెడ్డి జిల్లా వాసులు రాణించారు. షాద్నగర్లోని టీచర్స్కాలనీకి చెందిన రాఘవేందర్ రావు కుమార్తె ఇంద్రార్చిత కొంతకాలంగా సివిల్స్కు ప్రిపేర్ అవుతోంది. తాజాగా విడుదలైన UPSC ఫలితాల్లో 739 ర్యాంక్ సాధించింది. పట్టుదలతో చదివి ర్యాంక్ సాధించడం పట్ల షాద్నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియాలో రంగారెడ్డి జిల్లా యువత మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.
News April 22, 2025
MHBD: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన మోడల్ కాలేజ్ విద్యార్థులు

ఇంటర్ పరీక్షల ఫలితాల్లో మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఉత్తమ ఫలితాలతో రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో నిలిచారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులలో బి.సాయి సుష్మ 462/470 (ఎంపీసీ), జె.మధుమిత 426/470(బైపీసీ), ఏ.శ్రీలక్ష్మి 447/500( సీఈసీ), విద్యార్థులను ప్రిన్సిపల్ జి.ఉపేందర్ రావు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
News April 22, 2025
విపత్తులతో ఏ ఒక్కరూ చనిపోకూడదు: అనిత

AP: ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరి ప్రాణాలు పోవడానికి వీల్లేదని హోంమంత్రి అనిత అన్నారు. దీనిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు. ‘గత ప్రభుత్వం వంతెనలు, డ్రైనేజీలు, సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో విపత్తులు సంభవిస్తున్నాయి. ఇకపై ఇలాంటివి సంభవించకుండా జాగ్రత్త పడతాం’ అని ఆమె వ్యాఖ్యానించారు.