News April 11, 2025
ములుగు జిల్లాలో నేటి టాప్ న్యూస్

*యువత డ్రగ్స్కు అలవాటు పడద్దు: ఏఎస్పీ
*నేరాల నిరోధానికి సీసీ కెమెరాలు ఏర్పాటు-ఎస్సై
*మంగపేటలో రైతు ఆత్మహత్య
* రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: బడే నాగజ్యోతి
* అడవుల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఏటూరు నాగారం ఫారెస్ట్ అధికారి.
* విద్యార్థులు ఇంగ్లీష్ పట్ల భయం పోగొట్టుకోవాలి: కలెక్టర్
Similar News
News April 20, 2025
నా పేరు తొలగింపుపై కోర్టుకెళ్తా: అజారుద్దీన్

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ HCA అంబుడ్స్మన్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఇండియా జట్టుకు 10ఏళ్లు కెప్టెన్గా ఉన్న వ్యక్తి <<16150970>>పేరు తొలగించమనటం<<>> సిగ్గుచేటని అన్నారు. తానేమి మూర్ఖుడని కాదని, స్టాండ్కు పేరు పెట్టె సమయానికే తన పదవీకాలం ముగిసిందని పేర్కొన్నారు. అవినీతి కార్యకలాపాల్లో పాల్గొననందుకే కొంతమంది అధికారులు తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
News April 20, 2025
రేపు భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు

USA ఉపాధ్యక్షుడు JD వాన్స్ రేపటి నుంచి భారత్లో పర్యటించనున్నారు. కుటుంబ సమేతంగా ఈ నెల 24 వరకు పలు చారిత్రక ప్రాంతాలను సందర్శించనున్నారు. రేపు ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్టులో దిగనున్న ఆయనకు క్యాబినెట్ మంత్రి స్వాగతం పలకనున్నారు. ఢిల్లీలోని అక్షర్ధామ్, చేనేత ఉత్పత్తుల దుకాణాలు సందర్శించనున్నారు. సా.6.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యి భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై వాన్స్ చర్చిస్తారు.
News April 20, 2025
‘చట్టాలన్ని ఆడవారికే’ .. భార్య టార్చర్తో భర్త సూసైడ్

భార్య వేధింపులు తాళలేక యూపీలో మోహిత్ కుమార్ అనే ఫీల్డ్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్తినంతా భార్య వారి కుటుంబసభ్యుల పేరు మీదకు మార్చాలని, లేకుంటే తనపై వరకట్న వేధింపుల కేసు పెడతానని బెదిరించిందని తెలిపారు. ప్రస్తుతమున్న చట్టాలన్నీఆడవారికే అనుకూలంగా ఉన్నాయని, మగవారిని రక్షించేలా చట్టాలుంటే తాను ఈ నిర్ణయం తీసుకునే వాడిని కాదని వీడియో రికార్డు చేసి ప్రాణాలు వదిలారు.