News March 11, 2025

ములుగు జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

image

ములుగు జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 35 నుంచి 38 డిగ్రీలు, రేపు కూడా అవే ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.

Similar News

News April 14, 2026

అనకాపల్లి: రానున్న 5 రోజులు జిల్లాలో పొడి వాతావరణం

image

రాగల ఐదు రోజులలో అనకాపల్లి జిల్లాలో వాతావరణం పొడిగా ఉండి, ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 34.7 నుంచి 35.0 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠంగా 23.7 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా.సీహెచ్ ముకుందరావు తెలిపారు. సోమవారం తన ఛాంబర్‌లో మాట్లాడుతూ.. రైతులు పొడి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని గింజ గట్టి పడే దశలో ఉన్న వరికి నీరు ఉండేలా చూసుకోవాలన్నారు.

News April 14, 2026

ఏప్రిల్ 14: చరిత్రలో ఈరోజు

image

1891: భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ జయంతి (ఫొటోలో)
1892: తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత గొబ్బూరి వెంకటానంద రాఘవరావు జయంతి
1939: సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు జయంతి
1950: భారత తత్వవేత్త శ్రీ రమణ మహర్షి వర్ధంతి
1963: రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వర్ధంతి
2011: సినీ నటుడు, ప్రతినాయకుడు రామిరెడ్డి వర్ధంతి

News April 14, 2026

శ్రీకాకుళం: CHOలకు గుడ్ న్యూస్

image

శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యశాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 594 మంది CHO/MLHPల విధులపై ఆరోగ్యశాఖ ఉన్నత అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 8PM FRSను రద్దు చేస్తూ దానిని అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా జీవో విడుదల చేశారు. మహిళా CHOలకు ఇబ్బందిగా ఉన్న ఈ ప్రక్రియను రద్దు చేయడంపై జిల్లా CHOలు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.