News April 13, 2025
ములుగు జిల్లాలో మళ్లీ పులి సంచారం..!

తాడ్వాయి, ఏటూరునాగారం సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏటూరునాగారం, పస్రా అటవీ శాఖ రేంజ్ అధికారులు హెచ్చరించారు. ఏటూరునాగారం వన్యప్రాణి డివిజన్ పరిధిలోని అడవిలో పులి సంచరిస్తున్న సమాచారం మేరకు వాటి అడుగుజాడల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. మహదేవపూర్, మేడారం సరిహద్దుల్లో ఓ పశువును పులి చంపిందన్న సమాచారం మేరకు బయ్యక్కపేట, ఐలాపూర్ ప్రాంతాల్లో పులి కదలికలపై ఆరాతీస్తున్నామన్నారు.
Similar News
News November 20, 2025
ఖమ్మం: అమ్మ ఆదర్శ కమిటీలకు నిధులు విడుదల

ఖమ్మం జిల్లాలోని పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణ కోసం ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల’ఖాతాలకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నిధులు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,160 పాఠశాలలకు సంబంధించి మొత్తం రూ.1,13,78,000 నిధులను విడుదల జారీ చేశారు. రెండు నెలల కాలానికి ఉద్దేశించిన ఈ నిధులను ఏఏపీసీ సభ్యులు పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు, టాయిలెట్ల శుభ్రత, ఆవరణ నిర్వహణ కోసం వినియెాగించాలని సూచించారు.
News November 20, 2025
రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

RRB 5,810 NTPC పోస్టుల దరఖాస్తు గడువును పొడిగించింది. నేటితో అప్లై గడువు ముగియగా.. ఈనెల 27వరకు పొడిగించింది. ఫీజు చెల్లించడానికి ఈ నెల 29 వరకు ఛాన్స్ ఇచ్చింది. డిగ్రీ అర్హతతో 18- 33ఏళ్లు గల వారు అప్లై చేసుకోవచ్చు. CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 20, 2025
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ టర్మ్స్

బిహార్ రాజకీయ భీష్ముడిగా పేరొందిన నితీశ్ ఇవాళ 10వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన తొలిసారి 2000 సం.లో సీఎం అయ్యారు. అప్పటి నుంచి బీజేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్, లోక్ జన్శక్తి.. ఇలా ఎన్నో పార్టీలతో కలిసి సీఎం పీఠాన్ని అధిరోహించారు.
*2000 మార్చి 3- 2000 మార్చి 7 *2005-2010
*2010-2014 *2015 FEB 22- 2015 NOV 19 *2015-2017 *2017-2020 *2020-2022 *2022-24 *2024-2025 NOV.


