News February 4, 2025
ములుగు జిల్లాలో సీడీపీఓ ఆత్మహత్యాయత్నం

ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీడీపీఓ ధనలక్ష్మి కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం ఉదయం పాలు తీసుకువచ్చిన కార్ డ్రైవర్ సీడీపీవో ఇంట్లో స్పృహ తప్పి ఉండడం చూసి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 19, 2025
ఒంగోలు కోర్టులో 8మంది నేరస్థులకు జీవిత ఖైదు

మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో జరిగిన రత్నం బాబు(22) హత్య కేసులో 8మంది నేరస్థులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి టి.రాజవెంకటాద్రి తీర్పు ఇచ్చారు. రత్నంబాబు కరిష్మా అనే యువతిని ప్రేమించాడు. అది నచ్చని యువతి కుటుంబ సభ్యులు రత్నంబాబును కత్తులతో పొడిచి హత్య చేశారు. నేరం రుజువు కావడంతో వీరికి మంగళవారం శిక్ష ఖరారైంది.
News February 19, 2025
బాపట్ల జిల్లాలో 8మంది నేరస్థులకు జీవిత ఖైదు

బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో జరిగిన రత్నం బాబు(22) హత్య కేసులో 8మంది నేరస్థులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు అడిషనల్ డిస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి టి.రాజవెంకటాద్రి తీర్పు ఇచ్చారు. రత్నంబాబు కరిష్మా అనే యువతిని ప్రేమించాడు. అది నచ్చని యువతి కుటుంబ సభ్యులు రత్నంబాబును కత్తులతో పొడిచి హత్య చేశారు. నేరం రుజువు కావడంతో వీరికి శిక్ష ఖరారైంది.
News February 19, 2025
పెద్దాపురం: లలిత ఇండస్ట్రీస్లో జట్టు కార్మికుడు మృతి

పెద్దాపురంలో లలిత ఇండస్ట్రీస్లో జట్టు కార్మికుడు మంగళవారం స్నానం చేస్తూ బాత్ రూంలో మృతి చెందాడు. మృతుడు బిహార్ షబ్బీర్ ఆలం (34)గా గుర్తించారు. పచ్చకామర్లతో అనారోగ్యంగా ఉన్నాడని తోటి కార్మకులు తెలిపారు. మంగళవారం స్నానపు గదిలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.