News February 4, 2025
ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బలరాం

బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడిగా సిరికొండ బలరాంను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ కౌన్సిల్ సభ్యులుగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు భూక్యా జవహర్ లాల్ను నియమించింది. ఎస్టీ నియోజకవర్గమైన ములుగుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన బలరామును అధ్యక్షుడిగా నియమించడం విశేషం.
Similar News
News November 7, 2025
చినప్పన్న పాలెం మాజీ సర్పంచ్ అచ్చియ్యదొర మృతి

వైసీపీ నేత, చిన్నప్పన్నపాలెం మాజీ సర్పంచ్ దొండా అచ్చియ్య దొర మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం తన ఇంటి వద్ద మెట్ల పైనుంచి జారిపడి గాయపడ్డారు. అనకాపల్లిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. బుచ్చయ్యపేట (M) కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. మూడు దఫాలు సర్పంచ్గా, రెండు దఫాలు పాల సంఘం అధ్యక్షుడిగా, వడ్డాది పీఏసీఎస్ ఉపాధ్యక్షుడిగా, కస్పా నీటి సంఘం అధ్యక్షుడిగా ఆయన పని చేశారు.
News November 7, 2025
వానొస్తే.. ట్రైసిటీ హడల్..!

ఉమ్మడి WGLలో ఇటీవల సంభవించిన వరదలు ట్రైసిటీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వర్షం అంటేనే నాళాల పక్కన ఉన్న కాలనీల ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఏ సమయానికి వరదలు వచ్చి ఇళ్లు మునుగుతాయోనని, ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు. WGLలో CM పర్యటించినా, ముంపునకు శాశ్వత పరిష్కారం దొరకలేదని, అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని నివాసితులు కోరుతున్నారు. మీ కాలనీకి వరద వచ్చిందా?
News November 7, 2025
నిడదవోలులో యాక్సిడెంట్.. యువకుడి మృతి

నిడదవోలు ఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. త్రిబుల్ రైడ్ చేస్తూ వస్తున్న ముగ్గురు యువకులు డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


