News January 28, 2025
ములుగు జిల్లా రైతు భరోసా DETAILS

ములుగు జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి 86,338 మంది రైతులు అర్హత కలిగి ఉండగా, వీరికి సంబంధించిన 1,77,631 ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. ఇందుకు సంబంధించి రూ.106.57 కోట్ల నిధులలో సోమవారం రైతుల ఖాతాలలో రూ.8.26 కోట్లు జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు. మిగతా రైతులకు విడతల వారీగా వారి ఖాతాలలో మార్చి 31వ తేదీ లోపు నిధులు జమ అవుతాయని ప్రభుత్వం ప్రకటించిన విషయం విధితమే.
Similar News
News February 27, 2026
బాన్సువాడ: దొంగల మూఠా అరెస్ట్

విద్యుత్ ట్రాన్స్ఫార్మల నుంచి కాపర్, ఆయిల్ చోరికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడ DSP విఠల్ రెడ్డి వివరాల ప్రకారం.. పలు గ్రామాల్లో దుండగులు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్, ఆయిల్ చోరికి పాల్పడుతున్నారు. దర్యాప్తు చేపట్టి నిందితులు సుభాష్, కరీం, సురేఖఅర్జున్ తాంబే, సునీల్ శ్యామ్ రావు వాగ్మారేను గురువారం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
News February 27, 2026
పాక్-అఫ్గాన్ బార్డర్లో యుద్ధ వాతావరణం

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ ఇటీవల జరిపిన<<19206132>> వైమానిక దాడులకు<<>> ప్రతీకారంగా తాలిబన్లు భారీ ఆపరేషన్ మొదలెట్టారు. డురాండ్ లైన్ వెంట పాక్కు చెందిన 15 చెక్పోస్టులను అధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్ ప్రకటించింది. ఈ దాడుల్లో 40 మంది పాక్ సైనికులు చనిపోయారని మరికొందరిని బంధించామని తెలిపింది. అటు పాక్ కూడా దీటుగా బదులిస్తున్నామని, పలువురు తాలిబన్లను చంపామని అంటోంది.
News February 27, 2026
పాలమూరు: హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి

TGSC స్టడీ సర్కిల్లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్ నగర్లోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మార్చి1న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.


