News January 28, 2025

ములుగు జిల్లా రైతు భరోసా DETAILS

image

ములుగు జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి 86,338 మంది రైతులు అర్హత కలిగి ఉండగా, వీరికి సంబంధించిన 1,77,631 ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. ఇందుకు సంబంధించి రూ.106.57 కోట్ల నిధులలో సోమవారం రైతుల ఖాతాలలో రూ.8.26 కోట్లు జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు. మిగతా రైతులకు విడతల వారీగా వారి ఖాతాలలో మార్చి 31వ తేదీ లోపు నిధులు జమ అవుతాయని ప్రభుత్వం ప్రకటించిన విషయం విధితమే.

Similar News

News January 10, 2026

సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా..! సమాచారం ఇవ్వండి- ఎస్పీ

image

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని, పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని విలువైన వస్తువులు లాకర్ల లోనే భద్రపరుచుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి విజ్ఞప్తి చేశారు. పండుగకు ఊర్లకు వెళ్తారని ఇదే అవకాశంగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ముందుగానే పోలీసులకు సమాచారం ఇస్తే పెట్రోలింగ్‌లో భాగంగా ఆయా ఇండ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని అన్నారు.

News January 10, 2026

పుతిన్‌నూ అదుపులోకి తీసుకుంటారా?.. ట్రంప్ సమాధానమిదే!

image

వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురోను <<18751661>>అదుపులోకి<<>> తీసుకుని అమెరికా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అలానే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా పట్టుకోవాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ట్రంప్ ‘అలా చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా’ అని బదులిచ్చారు. పుతిన్‌తో తనకు మంచి రిలేషన్ ఉందని చెప్పారు. కానీ ఆయన విషయంలో నిరాశకు గురయ్యానని అన్నారు.

News January 10, 2026

పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్‌లో 17న తుక్కు వేలం

image

విశాఖలో పోలీస్ స్టేషన్లు, విభాగాలు నుంచి సేకరించిన నిరుపయోగమైన ఇనుము, అల్యూమినియం, చెక్క, ప్లాస్టిక్ వస్తువులు జనవరి 17న వేలం వేయనున్నట్లు విశాఖ సీపీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆరోజు ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు జనవరి 12 ఉదయం 10 నుంచి వస్తువులను చూసుకొనవచ్చన్నారు. వేలంలో పాల్గొనే వారు పోలీస్ బ్యారెక్స్, కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు.