News April 5, 2025

ములుగు: ధాన్యం సేకరణపై అడిషనల్ కలెక్టర్ సమీక్ష

image

రబి 2024-25 కాలానికి సంబంధించి ధాన్యం సేకరణ కొరకు ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. రబీ ధాన్యం సేకరణలో అందరు రైస్ మిల్లర్లు పాల్గొనాలని ఆదేశించినారు. 7 బాయిల్డ్ మిల్లుల్లో ధాన్యం సేకరణలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మిగతా రా రైస్ మిల్లర్స్ సైతం కొందరు ధాన్యం సేకరణలో పాల్గొంటారన్నారు.

Similar News

News January 9, 2026

పార్వతీపురం: మన్యం కళావేదిక లోగో ఆవిష్కరణ

image

మన్యం కళావేదిక లోగోను కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గురువారం కళాకారులు, సాహితీ వేత్తల మధ్య ఆవిష్కరించారు. జిల్లా ఏర్పడిన తర్వాత సాంస్కృతిక, సాహిత్య రంగాల అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అధికారిక వేదిక ఇదని పేర్కొన్నారు. జిల్లాలోని కళాకారుల నైపుణ్యాన్ని వెలికితీసి, వారిని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడమే ఈ కళావేదిక ప్రధాన లక్ష్యమన్నారు.

News January 9, 2026

నగరవాసులకు జీహెచ్ఎంసీ తీపి కబురు!

image

నగరవాసులకు జీహెచ్ఎంసీ తీపి కబురు అందించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తిపన్ను బకాయిదారులకు భారీ ఊరటనిస్తూ వన్ టైమ్ స్కీమ్(టీఎస్)ను ప్రకటించింది. దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 90 శాతాన్ని మాఫీ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్టన్ తెలిపారు. ఈరాయితీ జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేట్ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులకు కూడా వర్తిస్తుందన్నారు.

News January 9, 2026

హజ్ యాత్రకు వీరు అనర్హులు: సౌదీ ప్రభుత్వం

image

హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 వర్గాల వారికి అనుమతి లేదని స్పష్టం చేసింది. డయాలసిస్ రోగులు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయ వ్యాధులతో బాధపడేవారు, కీమోథెరపీ చేయించుకున్న క్యాన్సర్ రోగులు, వైకల్యంతో ఉన్నవారు, అలాగే 28 వారాలు నిండిన గర్భిణీలను అనర్హులుగా ప్రకటించింది. మరోవైపు ప్రైవేట్ గ్రూపుల ద్వారా వెళ్లేవారు ఈ నెల 15లోపు బుకింగ్‌లు పూర్తి చేయాలని హజ్ సంఘాలు సూచించాయి.