News April 5, 2025

ములుగు: ధాన్యం సేకరణపై అడిషనల్ కలెక్టర్ సమీక్ష

image

రబి 2024-25 కాలానికి సంబంధించి ధాన్యం సేకరణ కొరకు ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. రబీ ధాన్యం సేకరణలో అందరు రైస్ మిల్లర్లు పాల్గొనాలని ఆదేశించినారు. 7 బాయిల్డ్ మిల్లుల్లో ధాన్యం సేకరణలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మిగతా రా రైస్ మిల్లర్స్ సైతం కొందరు ధాన్యం సేకరణలో పాల్గొంటారన్నారు.

Similar News

News April 18, 2025

రేపు జేఈఈ మెయిన్ ఫలితాలు: NTA

image

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫలితాలను రేపు వెల్లడిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. ఫైనల్ ఆన్సర్ కీలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అధికారిక <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. నిన్న ఫైనల్ ‘కీ’ని రిలీజ్ చేసి, మళ్లీ వెబ్‌సైట్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

News April 18, 2025

ఖమ్మం: అనుమానస్పద స్థితిలో బావిలో బాలుడి మృతదేహం

image

అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడి మృతదేహం బావిలో లభ్యమైన ఘటన శుక్రవారం బోనకల్ మండలంలో చోటు చేసుకుంది. లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ బావిలో తెల్లవారుజామున ఓ బాలుడి మృతదేహం తేలియాడుతూ స్థానికుల కంటపడింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడా? లేక ఎవరైనా హత్య చేశారా? వంటి కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది.

News April 18, 2025

SUMMER HOLIDAYS.. కామారెడ్డి జిల్లాకు స్వాగతం!

image

వేసవి సెలవులు షురూ కావడంతో, ఎక్కడికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారా? ప్రకృతి రమణీయత, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు కామారెడ్డి జిల్లాలో అనేకం ఉన్నాయి. దోమకొండ కోట, నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు, నాగన్న బావి, తెలంగాణ తిరుమల, కాలభైరవ స్వామి, సిద్ధ రామేశ్వర స్వామి, షిర్డీ సాయిబాబా ఆలయాలున్నాయి. ఈ అందమైన ప్రదేశాలను సందర్శించి మరపురాని జ్ఞాపకాలను సొంతం చేసుకోండి!

error: Content is protected !!