News March 15, 2025
ములుగు: నేటీ నుంచి అంగన్వాడీలకు ఒంటిపూట

రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేల అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట బడులు నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల తరహాలోనే శనివారం నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నడపాలని మంత్రి సూచించారు.
Similar News
News November 23, 2025
ఆరేళ్ల తర్వాత భారత్లో సెంచరీ.. ముత్తుసామి రికార్డ్

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో డెబ్యూ సెంచరీ చేసిన ముత్తుసామి(109) పలు రికార్డులను సాధించారు. ఆరేళ్ల తర్వాత భారత గడ్డపై ఏడు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్కు దిగి సెంచరీ చేసిన SA ప్లేయర్గా నిలిచారు. చివరిసారిగా 2019లో డికాక్ శతకం బాదారు. అలాగే భారత్, పాక్, బంగ్లాదేశ్లలో 50+ స్కోర్లు చేసిన నాలుగో సౌతాఫ్రికా ఆటగాడిగానూ ఘనత సాధించారు. బవుమా, బౌచర్, గ్రేమ్ స్మిత్ మాత్రమే గతంలో ఈ ఫీట్ నమోదు చేశారు.
News November 23, 2025
గుంపుల చెక్డ్యామ్ కూలిన ఘటనపై పరిశీలించిన ఎమ్మెల్యే

ఓదెల(M) గుంపుల గ్రామంలో మానేరుపై నిర్మించిన చెక్డ్యామ్ నాసిరకంగా కట్టడం వల్ల కూలిపోయిందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అనేక చెక్డ్యామ్లు నాణ్యత లేకుండా నిర్మించడంతో కుప్పకూలాయని పేర్కొన్నారు. గుంపుల డ్యామ్ వద్ద ఎక్కడా బ్లాస్టింగ్ జరిగిన ఆనవాళ్లు లేవని, తప్పుడు ఆరోపణలు నిరాధారమని చెప్పారు. అప్పటి నాయకుల కమీషన్ లాభాల కోసం నాసిరక పనులు జరిగాయని విమర్శించారు
News November 23, 2025
కూటమి పార్టీలకు సమాన గుర్తింపు: ఎంపీ

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని కర్నూలు ఎంపీ నాగరాజు పిలుపునిచ్చారు. పంచలింగాలలో జనసేన పార్టీ నిర్వహించిన కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అరాచక పాలనను ముగించేందుకు పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి టీడీపీ-జనసేన-బీజేపీలను కూటమిగా ఏకం చేశారని అన్నారు. కూటమిలో ఉన్న మూడు పార్టీల కార్యకర్తలకు సమాన గుర్తింపు ఉంటుందన్నారు.


