News March 20, 2025

ములుగు: పది పరీక్షలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ములుగు జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. మార్చి 21 నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో నిర్వహణ విద్యాశాఖ సిబ్బందికి కలెక్టర్ ముందస్తు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, కేంద్రం వద్ద ఇద్దరు పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్ష పూర్తయ్యే వరకు ఎలాంటి కరెంట్ కోతలు ఉండవద్దన్నారు.

Similar News

News December 7, 2025

తెలుగువారి పరువు పోయింది.. రామ్మోహన్ రాజీనామా చేయాలి: అమర్నాథ్

image

AP: ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మంత్రి రామ్మోహన్ పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ‘చరిత్రలో ఈ తరహా ఇబ్బంది ఎదుర్కోవడం ఇదే తొలిసారి. దేశంలో తెలుగు వారి పరువు, ప్రపంచంలో ఇండియా పరువు పోయింది. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ సమయంలో ఆయన రీల్స్ చేసుకున్నారనే అపవాదులు వచ్చాయి. రామ్మోహన్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.

News December 7, 2025

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 15 నుంచి గుడివాడకు వందే భారత్

image

చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు ఈ నెల 15వ తేదీ నుంచి పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. అయితే నర్సాపురం, మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వందే భారత్ రైలు నడపాలని ప్రయాణికుల కోరుతున్నారు.

News December 7, 2025

సిద్దిపేట: గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం

image

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామాల్లో మందు, విందులను అభ్యర్థులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. గతంలో గ్రామానికి 10 నుంచి 20 వరకు బెల్టుషాపులు ఉండేవి. ప్రస్తుత జిల్లా సీపీ ఎస్ఎం విజయ్ కుమార్ బెల్టుషాపులను నియంత్రణలోకి తేవడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున వైన్ షాపుల బాట పట్టారు. ప్రత్యేకంగా డంపు చేసి, మందుబాబులకు అందిస్తున్నారు.