News March 18, 2025
ములుగు: ‘పది’ పరీక్ష పదిలంగా!

ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలు దగ్గర పడటంతో కొంతమంది విద్యార్థులు గాబరా పడి సమాధానం తెలిసినా సరిగా రాయలేకపోతుంటారు. వారంతా ఒత్తిడికి లోనుకాకుండా నేను బాగా చదివాను.. బాగా రాస్తాను అని కాన్ఫిడెంట్గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరంతా సెల్ఫోన్, టీవీకి దూరంగా ఉన్నట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 3,134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Similar News
News April 21, 2025
చమురు దిగుమతుల ఖర్చు ₹13.76L Cr

FY25లో భారత్ 24.24 కోట్ల టన్నుల క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంది. దీని విలువ ₹13.76 లక్షల కోట్లు. FY24తో పోలిస్తే 4.2% ఎక్కువ. మొత్తం దేశీయ చమురు అవసరాల్లో 89.1% దిగుమతుల ద్వారానే రావడం గమనార్హం. ఇదే సమయంలో దేశీయ చమురు ఉత్పత్తి 2.94 కోట్ల టన్నుల నుంచి 2.87 కోట్ల టన్నులకు తగ్గింది. గ్యాస్ దిగుమతి 15.4% పెరిగి 3,666MMSCM(మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్)కు చేరింది.
News April 21, 2025
IPL: ఇవాళ కీలక పోరు

కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇవాళ GT, KKR మధ్య మ్యాచ్ జరగనుంది. 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో టేబుల్ టాపర్గా ఉన్న గుజరాత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఏడింట్లో 3 గెలిచి ఏడో స్థానంలో ఉన్న కోల్కతా ప్లేఆఫ్స్ వెళ్లాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా GT 2, KKR ఒక మ్యాచ్లో గెలుపొందాయి. ఒకటి రద్దైంది. ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News April 21, 2025
MNCL జిల్లాలో విషాదం.. యువరైతు ఆత్మహత్య

పంట దిగుబడి వస్తుందో.. రాదోనని కలత చెంది రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జైపూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం.. పౌనుర్కు చెందిన యువ రైతు కుమార్(29)తన ఎకరం పొలంతో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని మేలు ఫిమేల్ సీడ్ వరి వేశాడు. బోరు ఎండి నీరు అందక ఆవేదన చెందాడు. 3 ఏళ్లుగా పంట సాగులో నష్టాలను చవిచూస్తున్న కుమార్ ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు.