News January 31, 2025
ములుగు: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 1,076 మంది విద్యార్థులను గాను రూ.6,13,320 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Similar News
News November 26, 2025
రాయికల్లో అత్యధికం.. జగిత్యాలలో అత్యల్పం

జగిత్యాల జిల్లాలో అత్యధికంగా గ్రామపంచాయతీలు రాయికల్ మండలంలో ఉండగా అత్యల్పంగా జగిత్యాల అర్బన్ మండలంలో ఉన్నాయి. రాయికల్ మండలంలో 32 పంచాయతీలు, 276 వార్డులు ఉన్నాయి. జగిత్యాల అర్బన్ మండలంలో 5 పంచాయతీలు, 50 వార్డులున్నాయి. త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలలో రాయికల్ మండలంలో 32 మంది సర్పంచులు, 276 మంది వార్డు సభ్యులు, జగిత్యాల అర్బన్ మండలంలో ఐదుగురు సర్పంచులు, 50 మంది వార్డు సభ్యులు ఎన్నికవ్వనున్నారు.
News November 26, 2025
మిరపలో కొమ్మ ఎండు, కాయ కుళ్లు తెగులు – నివారణ

మిరపలో ఈ తెగులు తొలుత లేత కొమ్మలు, పూతకు ఆశించడం వల్ల పూత రాలి, చివర్ల నుంచి కొమ్మలు కిందకు ఎండుతాయి. కాయలను ఆశించడం వల్ల కాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి, కుళ్లి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో డైఫెనోకోనజోల్ 25% EC 100ml లేదా క్రెసోక్సిమ్-మిథైల్ 44.3% SC 200mlలలో ఏదో ఒకటి కలిపి పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కల భాగాలను సేకరించి నాశనం చేయాలి.
News November 26, 2025
రాజమండ్రి: మాక్ అసెంబ్లీ విజేతలకు కలెక్టర్ అభినందన

విద్యాశాఖ నిర్వహించిన మాక్ అసెంబ్లీ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బుధవారం కలెక్టర్ కీర్తి చేకూరి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి మాక్ అసెంబ్లీలో 8 మంది విద్యార్థులు, జిల్లా స్థాయిలో 13 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆమె తెలిపారు.


