News March 21, 2025

ములుగు: పని పట్ల మంత్రి సీతక్క నిబద్ధత

image

ఎంతో ప‌ని ఒత్తిడి అసెంబ్లీ స‌మావేశాలున్నా శుక్రవారం ఉద‌యం ఎనిమిదిన్న‌ర‌కే ఎర్ర‌మంజిల్‌లోని మిష‌న్ భ‌గీర‌థ కార్యాల‌యానికి మంత్రి సీత‌క్క‌ చేరుకున్నారు. ఉదయం 9.45వర‌కు అధికారుల‌తో జిల్లా అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్, తాగు నీటి పంపిణిపై మంత్రి స‌మీక్ష‌ సమావేశం నిర్వహించారు. అనంత‌రం శాస‌న మండ‌లికి చేరుకుని బ‌డ్జెట‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో మంత్రి సీత‌క్క‌ పాల్గొన్నారు. 

Similar News

News November 24, 2025

జిల్లా కలెక్టరేట్లో రేపు దిశ సమావేశం

image

జనగామ కలెక్టరేట్లో మంగళవారం దిశ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పేర్కొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆదేశాలతో ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, రేపు ఉదయం 11 గం.కు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొనాలని కోరారు.

News November 24, 2025

బీజేపీతో పొత్తు.. కొట్టిపారేసిన ఒవైసీ

image

‘బీజేపీతో మజ్లిస్ పొత్తు’ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా వర్గాలు వక్రీకరించి తప్పుదోవ పట్టించాయన్నారు. ‘ఏ కూటమిలో చేరే ఆలోచన లేదు. బీజేపీ భాగస్వామ్యం ఉన్న ఏ సర్కారుకూ మద్దతివ్వం. అయితే సీమాంచల్‌(బిహార్)అభివృద్ధికి నితీశ్ ప్రభుత్వం కృషి చేస్తే సహకరిస్తాం’ అని స్పష్టం చేశారు. తమ పోరాటం ప్రజల హక్కుల కోసమేనని తేల్చి చెప్పారు.

News November 24, 2025

మెదక్: రిజర్వేషన్ల ఖరారు.. గ్రామాల్లో వేడెక్కనున్న రాజకీయం

image

ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సంకల్పించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. గత నెలల్లో ప్రభుత్వం 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని చూసి ఆ దిశగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికల నోటిఫికేషన్ జారి చేసింది. అనూహ్యంగా హైకోర్టు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని తెలపడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఉపసంహరించుకుంది.