News March 26, 2025

ములుగు: పిల్లల పాలిట శాపంగా ‘బోనోఫిక్స్’ మత్తు!

image

ములుగు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బోనోఫిక్స్ మత్తు పిల్లల పాలిట శాపంగా మారుతోంది. గంజాయి, డ్రగ్స్, మద్యపానం వంటి మత్తు పదార్థాల గురించి వింటూనే ఉంటాం. కానీ విద్యార్థులు, పిల్లలు బోనోఫిక్స్ అనే మత్తు పదార్థానికి అలవాటు పడుతున్నారు. పోలీసులు నిఘాతో దాడులు చేస్తున్న బోనోఫిక్స్ అమ్మకాలు ఆగడం లేదు. కొందరు షాపుల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా బోనోఫిక్స్ అమ్ముతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు.

Similar News

News April 2, 2025

చలాన్లు చెల్లించకపోతే లైసెన్స్ రద్దు?

image

చలాన్ల రికవరీని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒక చలాన్‌ను 3 నెలలలోపు చెల్లించకపోతే సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు చలాన్లు పడినవారి లైసెన్స్‌ను కనీసం 3 నెలలపాటు సస్పెండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఎక్కువ మొత్తం వసూలు చేస్తారని సమాచారం.

News April 2, 2025

రాష్ట్రంలోనే క్లీన్ ఎయిర్ సిటీగా కడప

image

AP: రాష్ట్రంలో అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న నగరంగా కడప నిలిచినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక్కడ 10 పీఎం స్థాయిలో 42 పాయింట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత 52 పాయింట్లతో నెల్లూరు రెండో స్థానంలో ఉండగా కర్నూలు, ఒంగోలు (56 ) మూడో స్థానంలో నిలిచాయి. అత్యంత కాలుష్య నగరంగా విశాఖపట్నం (120) నిలిచింది. అమరావతిలో ఎలాంటి పరిశ్రమలు, నిర్మాణాలు లేకపోయినా కాలుష్యం 71 పాయింట్లుగా నమోదైంది.

News April 2, 2025

తిరుపతి: ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం

image

కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ సంస్థ నెలకొల్పేందుకు అనుమతులు ఇస్తున్నామని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. తిరుపతిలోని ఆర్టీవో కార్యాలయంలో లైట్ మోటార్ వాహనాలు, హెవీ మోటర్ వాహనాల డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. తిరుపతిలో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఈ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.

error: Content is protected !!