News February 1, 2025

ములుగు: బీజేపీవి దిగజారుడు రాజకీయాలు: సీతక్క

image

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించేలా వివాదాలు సృష్టించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో అన్ని అవాస్తవాలనే కేంద్ర ప్రభుత్వం చేర్చిందని, నిరుద్యోగ సమస్య, ఆర్థిక రంగ ఒడిదుడుకులను కప్పిపుచ్చేందుకే సోనియాగాంధీ వ్యాఖ్యలపై వివాదం సృష్టిస్తున్నారన్నారు.

Similar News

News November 21, 2025

KNR: ‘కళాశాలల్లో ఫేస్ బయోమెట్రిక్ తప్పనిసరి’

image

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని డిగ్రీ, PG ప్రభుత్వ, ప్రైవేటు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్స్, సెక్రటరీస్, కరస్పాండెంట్లు, ఇన్‌ఛార్జిలతో SU ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో VC ఉమేష్ కుమార్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ నిబంధనల మేరకు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు అన్ని కళాశాలల్లో విద్యార్థులకు ఫేస్ బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలని అన్నారు.

News November 21, 2025

KNR: SU PG ఎగ్జామ్ ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

SU పరిధిలో జరుగనున్న MA, M.SC, MSW, M.COM విభాగాల్లో 3వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. ఇందులో భాగంగా అపరాధ రుసుము లేకుండా NOV 29 వరకు, లేట్ ఫీజు రూ.300తో DEC 3 వరకు ఎగ్జామ్ ఫీజ్ చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డా.సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని లేదా ఆయా కళాశాలను సంప్రదించాలని సూచించారు. SHARE IT.

News November 21, 2025

‘పసిడి’ పంచ్.. ఫైనల్లో గెలిచిన నిఖత్ జరీన్‌‌

image

వరల్డ్ బాక్సింగ్ కప్‌ ఫైనల్లో నిఖత్ జరీన్ విజయం సాధించారు. 51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. జువాన్ యి గువో (చైనీస్ తైపీ)పై 5-0 తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. నిఖత్ గెలుపుతో ఈ టోర్నీలో భారత మహిళలు గెలిచిన గోల్డ్ మెడల్స్ సంఖ్య 5కు చేరింది. మొత్తంగా ఈ టోర్నీలో 9 గోల్డ్, 6 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్‌ను భారత్ సాధించింది.